ఎమ్మేల్యే కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై బూతులు తిడుతూ ఓ వ్యక్తి దౌర్జన్యం చేశాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అయి చివరికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన సజ్జనార్.. నిందితుడిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిందితుడిపై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐపీసీ 341, 353, 506, 290 సెక్షన్ల కింద క్రైమ్ నంబర్ 893/2021 రిజిస్టర్ చేసినట్లు సజ్జనార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే అని స్పష్టం చేశారు. పౌరులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని తెలంగాణ ఆర్టీసీ కోరుతున్నట్లు పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే… రంగారెడ్డి జిల్లా బూర్గలు సమీపంలో44 వ జాతీయ రహదారిపై ఆదివారం ఆర్టీసీ డ్రైవర్ పై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. వనపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వనపర్తి వెళ్తోంది. వెనుక నుంచి ఎమ్మెల్యే స్టికర్ ఉన్న కారు ఓవర్ టేక్ చేస్తూ బస్సు ముందు నిలిపారు. కారులోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ వీఆర్ రెడ్డిని బూతులు తిడుతున్నారు. ఓ వ్యక్తి కర్ర పట్టుకొని బస్సు డోరు లాగే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనను ఓ ప్రయాణికుడు చిత్రీకరించి సోషల్ మీడియాలలో పోస్ట్ చేశాడు. ఆ కారుపై 14 ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు ఉన్నాయి. రూ.14,500 జరిమాన పెండింగ్ లో ఉందని తెలిసింది. ఈ ఘటన విషయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
FIR Booked against the accused in Cr. No 893/2021 u/s 341, 353, 506,290 r/w 34 IPC of @psshadnr_cyb #Police have assured us that stern action will be taken #TSRTC request Public not to take #Law into their hands otherwise #Law has to do its duty. No one is above law
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 8, 2021