ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడ గడలాడించింది. ప్రజలు పిట్టాల్లా రాలిపోయారు. మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థికంగా కోట్ల మంది తీవ్రంగా నష్టపోయారు. వేల మంది సొంతవారిని పోగొట్టుకొని అనాథలుగా మిగిలారు.
ప్రపంచంలో కరోనా మహమ్మారి ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంతోమంది ఐనవాళ్లను కోల్పోయి అనాథలుగా మిగిలారు. వ్యాక్సినేషన్ తర్వాత కరోనా కాస్త కంట్రోల్ అనిపించినా.. అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకొని ఇప్పటికీ కన్నీరు పెట్టుకునేవారు కోట్ల మంది ఉన్నారు. కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచింది.. సొంత మనిషికి కరోనా దూరంగా పారిపోయే పరిస్థితి నెలకొంది. మనుషుల ప్రాణాలే కాదు.. ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. సోషల్ మాధ్యమాల పుణ్యమా అని విడిపోయిన కొన్ని బంధాలు అనూహ్యంగా కలుస్తున్నాయి. అలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కరోనా సమయంలో రవిచంద్రన్ అనే వ్యక్తి కుటుంబం చిన్నాభినమైంది. రవిచంద్రన్ నైజిరియాలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఫ్యామిలీ విశాఖపట్టణంలో ఉండేవారు. సెలవుపై రవిచంద్రన్ విశాఖకు వచ్చి తన ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా గడిపి వెళ్లేవాడు. 2021 లో కరోనా ప్రభావం తో ఆయన భార్య చనిపోయింది. ఆ సమయంలో రవిచంద్రన్ నైజిరియాలో ఉన్నాడు.. రాలేని పరిస్థితి. ఈ దంపతుల బిడ్డలు హాస్య (9), మధుల (11). తల్లి చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య దగ్గర ఉన్నారు. కొంతకాలం తర్వాత వాళ్లు తమ దూరపు బంధువైన ఆండాళ్లు అనే మహిళకు అప్పగించారు. ఆమె కొంతకాలం తర్వతా హస్య ని కరీంనగర్ జిల్లా సైదాపూర్ కి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళకు అప్పగించింది.
అలా హాస్య చివరికి ఎగ్లాస్పూర్ అనే గ్రామానికి చేరుకుంది. ఆమె భాష, యాస చూసి గ్రామ సర్పంచ్ కే. రాజారెడ్డి హాస్య ఫోటో, వివరాలు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసి సైదాపూర్ ఎస్ఐ కి కూడా పెట్టాడు. అనూహ్యంగా ఆ మెసేజ్ నైజీరియాలో ఉన్న రవిచంద్ర వరకు చేరింది. ఆయన వెంటనే ఎస్ఐ తో మాట్లాడారు. హాస్య తన కూతురు అని.. తనకు దూరమైందని ఎమోషన్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇండియాకు వచ్చారు రవిచంద్రన్. తన కూతరుని చూసుకొని పట్టరాని ఆనందంలో మునిగిపోయాడు. హాస్యను తిరిగి తన వెంట తీసుకు వెళ్లేందుకు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉందని.. అవి పూర్తి చేసుకొని తన కూతురిని తన వెంట తీసుకు వెళ్తానని రవిచంద్రన్ తెలిపారు. ఏది ఏమైనా ఒక్క వాట్సాప్ మెసేజ్ విడిపోయిన తండ్రీ కూతుళ్లను కలిపిందని గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.