నేటికాలం యువతలో కొంతమంది జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. ఈజీ సంపాందన కోసం వారి కుటుంబ సభ్యులు అధికారాలను అనాధికారికంగా వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడి తండ్రి ఎస్సై విధులు నిర్వహిస్తూ కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆ యువకుడు పోలీసునంటూ పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉండే జంటలను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడే వాడు. అంతేకాక ఒకరి తెలియకుండా మరొకరిని అలా.. మూడు వివాహలు చేసుకున్నాడు. చివరికి జైలు పాలయ్యాడు. ఈఘటన హైదరాబాద్ లోని రాంగోపాల్ పేట పరిధిలో చోటు చేసుకుంది.
టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ఘన్పూర్కు చెందిన సృజన్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అతని తండ్రి ఎస్సైగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. జల్సాలకు అలవాటు పడిన సృజన్ కుమార్ పదవ తరగతి మత్రమే చదివాడు. ఈ క్రమంలో అనేక నేరాలకు పాల్పడుండేవాడు. ప్రస్తుతం మన్ననూర్లోని 4వ బెటాలియన్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న సాయంత్రం నెక్లెస్రోడ్లోని బతుకమ్మ ఘాట్వద్ద ఓ జంట కారు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సృజన్ తాను టాస్క్ఫోర్స్ పోలీసు అధికారినంటూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని వారిని బెదిరించాడు.
నకిలీ గుర్తింపు కార్డు చూపించి తనకు కొంత డబ్బు ఇవ్వాలని లేకుంటే కేసు పెడతానని బెదిరించాడు. ఈఘటనపై బాధితులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఆపిల్ రిస్ట్ వాచ్, ఆక్టివా వాహనం, రెండు ఆపిల్ ఫోన్లు, పోలీసు గుర్తింపు కార్డు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇతడు 2007 నుంచి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటి వరకు ఇతడిపై తెలంగాణాలో 14 కేసులు, ఏపీలో 4 కేసులు ఉన్నాయి. అతడిపై నాన్ బెయిల్ వారెంట్ పెండింగ్ ఉంది. అంతేగాక అతను ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.