వైద్యమే.. వ్యాపారంగా సాగుతున్న రోజులివి. తుమ్ము వచ్చింది అని ఆస్పత్రికి వెళ్తే.. లేని రోగం మరొకటి అంటగట్టి పంపిస్తారు. వాళ్ళ వ్యాపారం కోసం డాక్టర్లు ఎంతకైనా తెగించేస్తారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి 18 ఏళ్ళ క్రితమే ఠాగూర్ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి చికిత్స అందించడంలో డాక్టర్లు చేసే హడావుడి అంతా, ఇంతా కాదు. పక్కపక్కనున్న రూంల్లోకి బుర్రున తిరుగుతూ.. వైద్యం చేస్తున్నట్లు నటిస్తూ.. మొత్తానికి మనిషేమో చెంపేస్తారు. అచ్చం ఘటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి లో జరిగింది.
నరసింహులపేట మండలం కౌసల్యదేవిపల్లికి చెందిన ఏర్పుల యాకయ్య.. పది రోజుల కిందట అనారోగ్యం బారినపడి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చేరారు. అతన్ని పరిశీలించిన వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో బెడ్ కేటాయించారు. ఆపై.. వైద్యులు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్తున్నారు. ఎలా ఉంది అంటే.. ఏం మాట్లాడారు. ఇలానే పది రోజులు గడిచాయి. యాకయ్య బంధువులు ఏం అడిగినా సరైన సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వారు వచ్చి చూడగా.. యాకయ్య చనిపోయి ఉన్నారు. వైద్యం సరిగా అందక, ఎప్పుడు మృతిచెందాడో కూడా తెలియని దుస్థితి నెలకొందని బంధువులు వాపోతున్నారు.
కుటుంబసభ్యులు వచ్చి పరిశీలించి.. యాకయ్య మృతి చెందిన విషయం వైద్యులకు చెప్పేవరకు వారికి తెలియదని ఆరోపిస్తున్నారు. వారి ఒక్క విషయంలోనే కాదు.. అందరి పరిస్థితి ఇలానే ఉందని వాపోతున్నారు. ఏదో హడావుడి చేస్తున్నారే.. తప్ప వైద్యం మాత్రం చేయట్లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్వాకం.. ఠాగూర్ సినిమాని తలపించించిందని స్థానికులు చెబుతున్నారు. యాకయ్య మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ముందు నిరసన చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Sai Priya Missing: RK బీచ్ నుండి బెంగళూరులో పెళ్లి వరకు ! సాయి ప్రియ కంప్లీట్ స్కెచ్ ఇదే!
ఇదీ చదవండి: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం: బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య!