ఐదు సంవత్సరాల కిందట పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ మహిళలకు ఆపరేషన్ చేసింది ఓ లేడీ డాక్టర్. ఈ ఆపరేషన్ కారణంగా ఐదు సంవత్సరాలు నరకం అనుభవించింది సదరు మహిళ.
గత కొన్ని రోజులుగా ఆస్పత్రుల్లో వెలుగు చూస్తున్న సంఘటనలు చూస్తుంటే.. హాస్పటల్లకు వెళ్లాలంటేనే భయంగా ఉందంటున్నారు ప్రజలు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వెలుగు చూసిన వింత సంఘటన చూస్తే.. మీరు ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే. డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళ విషయంలో ఓ లేడీ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా.. సదరు మహిళ ఐదు సంవత్సరాలు నరకం అనుభవించింది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఐదు సంవత్సరాల కిందట పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. డెలివరీ కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ మహిళలకు ఆపరేషన్ చేసింది ఓ లేడీ డాక్టర్. అయితే ఆపరేషన్ సమయంలో ఉపయోగించిన కత్తెరను సదరు మహిళ కడుపులోనే మర్చిపోయి, కుట్లువేసింది. అనంతరం ఆమెను ఇంటికి పంపించారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాలుగా ఆ మహిళకు కడుపు నొప్పి వస్తుండటంతో.. ఏవో కొన్నిమందులు వాడుతూ వస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ నొప్పి తీవ్రం కావడంతో.. ఆ మహిళను హైదరాబాద్ తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.
ఈ క్రమంలో ఇక్కడ అన్ని పరీక్షలు నిర్వహించి, ఎక్స్ రే తీయగా.. అసలు విషయం బయటపడింది. ఆ మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాంతో గోదావరిఖనిలోని లేడీ వైద్యురాలి నిర్వాకం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ లేడీ డాక్టర్ ను నిలదీయగా.. కత్తెర తీసేందుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని సదరు లేడీ డాక్టర్ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ లేడీ డాక్టర్ తప్పు వల్ల 5 సంవత్సరాలు నరకం అనుభవించింది ఆ మహిళ. మరి లేడీ డాక్టర్ నిర్వాకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.