ఓ ఘటన కారణంగా జైల్లో ఉన్న భర్తను కలిసేందుకు వెళ్లి గర్భిణి అయిన ఆమె భర్త ముఖాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికి ప్రాణాలు దక్కలేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది?. తన భర్త చేసినటువంటి నేరం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
వారు ఇద్దరు ఒకరి మనసు ఒకరికి ఇచ్చుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబాల్లోని పెద్దలకు చెప్పారు. వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు ఆ యువతీ యువకుడికి వివాహం జరిపించారు. అలా వారి జీవితాన్ని చాలా సంతోషంతో గడుపుతున్నారు. కొంతకాలానికి ఆమె గర్భం దాల్చింది. ఇదే సమయంలో జరిగిన ఓ సంఘటన వారి జీవితంలో పెను విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే..
బీహార్ లోని భాగల్ పూర్ ప్రాంతంలోని ఘోఘా గోవింద్ పూర్ కు చెదిన గుడ్డు యాదవ్ కు ఘోఘా జనిదిహ్ కు చెందిన పల్లవి యాదవ్ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వారు వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. అలా కొంతకాలానికి పల్లవి యాదవ్ గర్భం దాల్చింది. ఆమె ఇప్పుడు ఎనిమిది నెలల గర్భిణి. అలా జీవితం సాగిపోతున్న క్రమంలో ఆ పల్లవి భర్త స్థానికంగా ఉండేటువంటి వ్యక్తి వినోద్ యాదవ్ తో భూతగాద చోటుచేసుకుంది. దీంతో గుడ్డు యాదవ్ పై వినోద్ యాదవ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గుడ్డు యాదవ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో గుడ్డు యాదవ్ గత ఎనిమిది నెలలుగా భాగల్ పూర్ సెట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే గర్భిణీగా ఉన్న గుడ్డు యాదవ్ భార్య పల్లవి యాదవ్ జైలులో ఉన్న తన భర్తను కలిసేందుకు జూన్ ఆరో తారీఖునాడు జైలుకు వెళ్లింది.
జైలుకు వెళ్లిన ఆమెకు భర్తను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. కాగా పల్లవి యాదవ్ తను భర్తను చూసే సమయంలో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యింది. వెంటనే స్పృహతప్పి కింద పడిపోయింది. జైలు అధికారులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పల్లవి యాదవ్ ను పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఆమెతో పాటుగా గర్భస్థ శిశువు కూడా మరణించినట్లుగా తెలిపారు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. వినోద్ యాదవ్ నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు తన అన్నను జైలుపాలు చేశారని గుడ్డు సోదరుడు ఆరోపించారు. తన భర్తను పోలీసులు వేదిస్తున్నారని, ఆయనను ఎప్పుడు బయటకు విడుదల చేస్తారో అని ఆందోళన చెందుతుండేదని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతికి పోలీసులే కారణమని ఆరోపించారు. పల్లవి మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.