మన ఇళ్లల్లో వినియోగించే కరెంట్ కు యూనిట్ల వారీగా ప్రతి నెల బిల్లు వస్తుంది. అయితే అప్పుడప్పుడు మనకు వచ్చే కరెంట్ బిల్లు షాక్ కొట్టినంత పని చేస్తాయి. అధికారుల పొరపాటు, మిషన్ టెక్నికల్ ఇష్యూ వంటి కారణాలతో కరెంట్ బిల్లుల లక్షల్లో వస్తుంటాయి. తాజాగా ఓ పంచాయతీ కార్యాలయానికి అలాంటి కరెంట్ బిల్లు వచ్చింది.
సాధారణంగా మన ఇళ్లలో వినియోగించే విద్యుత్ కు యూనిట్లను బట్టి బిల్లు వస్తుంది. మనం వాడిన యూనిట్ స్లాట్ ప్రకారం.. కరెంట్ బిల్లులు వస్తుంటాయి. ఇళ్లల్లో వాడే కరెంట్ కు వంద నుంచి రెండు వేల మధ్య వచ్చే అవకాశం ఉంది. అలానే పరిశ్రమలు, ఇతర దుకాణాలకు వాటి వినియోగాన్ని బట్టి విద్యుత్ బిల్లు అనేది ఉంటుంది. అయితే అప్పుడప్పుడు విద్యుత్ బిల్లులు మనకు షాక్ ఇస్తుంటాయి. అయితే ఈ విద్యుత్ బిల్లు అందించే సమయంలో అప్పుడప్పుడు అధికారులు పొరపాటులు చేస్తుంటారు. ఈక్రమంలో ఓ సాధారణ ఇంటికి లక్షల్లో కరెంట్ బిల్లు వస్తుంది. దీంతో ఆ ఇంటి యజమాని షాకవుతాడు. ఇలా ఒకటి, రెండు కాదు.. ఏకంగా అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఓ చిన్న పంచాయతీ కార్యాలయానికి ఏకంగా రూ.11.14 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆ కార్యాలయ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని కొత్తపల్లె అనే పంచాయతీ ఉంది. ఇటీవల పంచాయతీల పునర్విభజనలో భాగంగా కొత్తపల్లె అనే కొత్త పంచాయతీ ఏర్పడింది. ఈ క్రమంలో ఈ భవానికి ఇటీవల జనవరి నెలకు సంబంధించిన విద్యుత్ బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన పంచాయతీ ప్రజలు షాకవుతున్నారు. జనవరి నెలకు సంబంధించిన బిల్లు రూ.11.41 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. అలానే ఏసీడీ డ్యూ కింద మరో రూ. 8, 716 వడ్డించారు. ఈ నెల 17 లోపు బిల్లు చెల్లించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. ఈ కరెంటు బిల్లును చూసి సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శికి షాక్ కొట్టినంత పనైంది. ఏళ్ల తరబడి పెండింగ్ ఉన్న బిల్లులకు కూడ అంత పెద్ద మొత్తంలో రాదని, అలాంటిది మరీ ఇంత రావటమేంటని పంచాయతీలో పనిచేసేవాళ్లు బుర్ర పగిలిపోయింది. ఇలా బిల్లు ఎలా వస్తుందని సర్పంచ్, కార్యదర్శి విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. దీంతో పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని అధికారులు హామి ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఓ వైపు ప్రభుత్వ నిధులు రాక పంచాయాతీలు అల్లాడిపోతుంటే.. ఇలా కోట్లలో విద్యుత్ బిల్లులు వచ్చి షాకిస్తుంటే ఏం చేయాలని పంచాయతీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ సాంకేతిక సమస్య కారణంగా ఈ పొరపాటు జరిగిందని అధికారులు తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చించి.. బిల్లులో లోపలను సరిచేసి కొత్త బిల్లు ఇస్తామని స్థానిక విద్యుత్ అధికారులు హామి ఇచ్చారు. దీంతో పంచాయతీ అధికారులతో పాటు సర్పంచ్, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ కార్యాలయానికి ఇలా బిల్లులు వస్తే.. వెంటనే స్పందించారు. అదే తమ ఇళ్లకు ఇలా కరెంట్ బిల్లులు వస్తే మమ్మల్ని ఆదుకునేది ఎవరని, మా సమస్యను ఎవరూ పరిష్కరిస్తాని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పొరపాటులు మరోసారి జరగకుండా జాగ్రత్తపడాలని విద్యుత్ అధికారులను ప్రజలు కోరారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.