దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. తాజాగా పొయ్యిలో కట్టెలు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన ఆదివాసీ మహిళలపై అటవీశాఖ అధికారులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. దాడి చేయడంతోపాటు వివస్త్రను చేసి కొట్టారంటూ బాదిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా లోని గిరిజన మహిళలను వివస్త్రం చేసిన ఘటనపై విచారణకు ఆదేశించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ ఘటనలపై విచారణ ప్రారంభించారు గిరిజనశాఖ ఉన్నతాధికారులు. గిరిజన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సహించబోయేది లేదని.. అది ఎంతటి వారైనా శిక్షార్హులే అని అన్నారు. గిరిజన మహిళపై అలాంటి సంఘటన జరగడం అవమానకరం అని ఆమె అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
ఇది చదవండి : హైదరాబాద్ లో దారుణం.. లిఫ్ట్ లో ఇరుక్కుని మహిళ మృతి!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సాకివాగు సమీపంలో ఇటీవల చత్తీస్ఘడ్ నుంచి వలస వచ్చిన కూలీలు నివాసముంటున్నారు. కట్టెలు తెచ్చుకునేందుకు సమీపంలోని అడవిలోకి వెళ్లారు. అటువైపుగా వచ్చిన ఫారెస్ట్ గార్డులు వీరిపై దాడి చేశారు. ఒక మహిళ పరిగెడుతూ గుంతలో పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మిగిలిన ముగ్గురిలో ఒక మహిళపై తీవ్రంగా దాడి చేశారని, వివస్త్రను చేసి దాడి చేశారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిపై మహిళా సంఘాలు, ఆదివాసీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. దాడికి పాల్పపడినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.