మరణించిన వారి జ్ఞాపకాలు మిగిలివుండాలంటే.. సరైన మార్గం.. అవయవదానం. ఇలా చేయడం వల్ల జ్ణాపకాలు మిగిలిపోవడంతో పాటు మరో నలుగురికి పునర్జన్మను ప్రసాదించవచ్చు. రోడ్డు ప్రమాదాల బారిన పడి నిత్యం ఎంతో మంది మరణిస్తున్నారు .వీరిలో కనీసం పది వంతైనా అవయవదానానికి అంగీకరిస్తే.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న మరొకరికి ప్రాణం పోయొచ్చు.
రాను.. రాను.. ప్రజలలో అవయదానంపై అవగాహన పెరుగుతోంది. ఇక జీవించడం కష్టం అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అవయవాదనంతో మరికొందరి జీవితాల్లోకి వెలుగులు నింపడానికి ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై.. బ్రెయిన్ డెడ్ బారిన పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న వారి శరీర భాగాలను మరొకరికి దానం చేస్తున్నారు. ఇలా మరణించిన వారి జ్ఞాపకాలను మరొకరి చూసుకుంటున్నారు. ఆ కోవకు చెందిందే ఈ వార్త. ప్రమాదవశాత్తూ బైక్ పై నుంచి పడి బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ అవయవదానానికి అంగీకరించి కుటుంబీకులు ఎంతో ఔదార్యం చాటారు.
ఖమ్మం పట్టణ పరిధిలోని టేకులపల్లికి చెందిన ప్రమీల, శ్రీనివాసరావు ఇద్దరూ భార్యాభర్తలు. వీరు గతవారం ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన బంధువుల ఫంక్షన్ కు హాజరై తిరిగి టూ వీలర్పై తమ సొంతూరుకు తిరిగొస్తున్నారు. ఇలా తిరిగొస్తుండగా మహిళ ప్రమాదవశాత్తూ బైక్ పై నుంచి జారీ పడిపోయింది. వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రికి తీసుకురాగా, వివిధ పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా కుటుంబసభ్యులకు తెలిపారు.
అనంతరం అవయవదానంపై డాక్టర్లు, మహిళ కుటుంబీకులకు అవగాహన కల్పించగా వారు అందుకు అంగీకరించారు. ఆ మేరకు వైద్యులు మాహిళ శరీరం నుండి అవయవాలను సేకరించారు. అయినవారిని పోగొట్టుకున్న బాధలోనూ.. ఆ కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుందంటూ నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు. మరణించిన వారిని భూమిలో పాతిపెట్టడం వల్ల మట్టిలో కలిసిపోతారే తప్ప తిరిగిరారు. అదే అవయవదానం చేస్తే మరో నలుగురికి పునర్జన్మనిచ్చిన వారవుతారు. కావున మీరు కూడా మరిణించిన వారు జ్ఞాపకాలను మరొకరిలో చూసుకోవాలనుకుంటే.. అవయవదానానికి ఆంగీకరించండి. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.