తెలంగాణలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈమధ్యే అంబర్పేట్లో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనే రాష్ట్రంలో మరోచోట జరిగింది.
తెలంగాణలో వీధి కుక్కల దాడుల ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. కానీ తగ్గట్లేదు. ఇటీవల హైదరాబాద్లోని అంబర్పేట్లో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడికి దిగడం, ఈ ఘటనలో బాలుడు మృతి చెందడం తెలిసిందే. ఇదే తరహా ఘటనలలు హైదరాబాద్లోని చైతన్యపురితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనారావుపేటలోనూ చోటుచేసుకున్నాయి. తాజాగా ఇలాంటి తరహా మరో ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం జిల్లా, బోనకల్లో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. జస్విత అనే ఐదేళ్ల చిన్నారి మీద వీధి కుక్కలు అటాక్ చేశాయి. దీంతో పాప కంటికి తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన ట్రీట్మెంట్ కోసం చిన్నారిని హైదరాబాద్కు తరలించారు. మరి.. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలను నివారించడం కోసం తీసుకోవాల్సిన చర్యలేంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.