రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ఎన్నికల కేంద్రాల వద్ద చేతి వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని పాల్ తెగ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు కేఏ పాల్ అదిరిపోయే పంచ్ వేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మునుగోడులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు పలు పోలింగ్ బూత్ లకు కేఏ పాల్ వెళ్లారు. అక్కడికి వెళ్లే సమయంలో ఆయన చేతి వేళ్లన్నింటికీ ఉంగారాలు ధరించి వెళ్లగా.. “మీది ఉంగరం గుర్తు.. చేతికి ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్ లోకి రావడం నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదా? ” అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి కేఏ పాల్ అదిరిపోయే పంచ్ వేశాడు. టీఆర్ఎస్ వాళ్లు వందల సంఖ్యలో కార్లు వేసుకుని 30 వేల మంది తిరుగుతున్నారు. వాళ్ల గుర్తు కారు కదా.. అని కార్లు కాకుండా సైకిళ్లపై వస్తారా?. చేతికి ఉంగరం అనేది కామను, అలాగే వాళ్లు కార్లలో రావడం అనేది కామన్. అది సమస్య కాదు. ఇక్కడ పలు చోట్ల ఎన్నికల రూల్స్ ఉల్లంఘించి కొందరు ప్రవర్తిస్తున్నారు” అని కేఏ పాల్ అన్నారు.
ఇంకా ఆయన మట్లాడుతూ.. “పోలీసులు నాపై, మీడియాపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొందరి మీడియా వారిపై దురుసుగా ప్రవర్తింస్తుంటే నేనే అడ్డుకున్నాను. మాకు అనుమతులు ఉన్నాయి. టీఆర్ ఎస్ వాళ్లు కార్లువేసుకొని లోపలి రావచ్చా? మునుగోడు ప్రజలు మార్పును, అభివృద్ధిని కోరుకుంటున్నారు. సాయంత్రం లోపు కనీసం వంద పోలింగ్ బూతులైన సందర్శించాలి. అవినీతి జరగకుండా చూడాలి. గత ఎన్నికల సమయంలో నర్సాపురంలో మధ్యాహ్నం 12 గంటలకు కొన్ని పోలింగ్ కేంద్రలో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అయితే మునుగోడులో మాత్రం ఉదయం 7 గంటలకే ఎన్నికలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు బాగా నిర్వహింస్తుంది. ఎలక్షన్స్ అఫిషియల్స్..గ్రేట్ ఫుల్ టూ యూ” అని కేఏ పాల్ ప్రశంసించారు.