దేశ వ్యాప్తంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు ఒక్కో షాక్ తగులుతూ వస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గ్యాస్, చమురు ధరలు పెరిగి సతమతమవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. 14శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ టీఆఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి 19శాతం పెంపునకు అనుమతికోరాయి డిస్కంలు.
డొమెస్టిక్ పై 40-50పైసల పెంపు.. ఇతర కేటగిరీలపై యూనిట్ కు రూపాయి చొప్పున పెంపు. 19 శాతం విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరగా… 14 శాతం మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ తెలంగాణ ఈఆర్ఎసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సీఎం కేసీఆర్ చార్జీల పెంపు కే మొగ్గు చూపితే… తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుండి కరెంటు చార్జీలు పెరగనున్నాయి. ఇదే గనక జరిగితే తెలంగాణ వ్యాప్తంగా సామాన్యులకు మరింత భారం పడనుంది.