గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ. 1000 జరిమానాను భారీగా తగ్గించారు. కేవలం రూ.10 కట్టితే చాలని తెలిపారు.
ఒక్కొక్క కేసుకు కేవలం రూ.10 మాత్రమే కట్టి కేసులను కొట్టివేయించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ అవకాశం మే2 నుంచి మే 8 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ కమిషనర్ వెల్లడించారు. ఏ పోలీస్టేషన్ పరిధిలో కేసు నమోదైందో అక్కడి వెళ్లి ఆధార్ చూపి.. రూ.10 కట్టి కేసు క్లోజ్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. గతంలో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల విషయంలో భారీ స్పందన చూసి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా లాక్ డౌన్ సమయంలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కింద దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయి. వాటిని క్లియర్ చేసేందుకు పోలీసులు ఈ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.