తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే అతి పెద్ద మేడారం జాతర.. వనదేవతలక జనజాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. చిన్నా, పెద్దా, ఆడా మగా అన్న తేడాలేకుండా కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. ఈ నెల 16 నుంచి మేడారంలో మొదలయ్యే సమ్మక్క సారలమ్మ మహాజాతరకు గత నెలరోజులుగా ప్రతీరోజూ వేలాదిమంది భక్తులు వెళ్ళి దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటున్నారు. ఈ సంవత్సరం చాలామంది వనదేవతలను దర్శనం చేసుకోవాలని ఉన్నా కరోనా భయాలు వెంటాడుతుండటంతో రాలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం దేవాదాయ శాఖ సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చింది.
ఇది చదవండి: సీఎం జగన్ చూసి ఆశ్చర్యపోయిన చిన జీయర్ స్వామి
భక్తులు ఇంటి నుంచే మొక్కులు చెల్లించడంతోపాటు ప్రసాదాన్ని కూడా పొందేలా ఆర్టీసీ, తపాలాశాఖతో కలిసి దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో అమ్మవార్ల ప్రసాదం సేవలు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ఇంటికి వచ్చి దానిని తీసుకువెళ్లి వనదేవతల ఆలయ నిర్వాహకులకు అందజేస్తారని, అక్కడ అమ్మవారికి దానిని అర్పించిన తరువాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
టీఎస్ ఫోలియా యాప్ ద్వారా ఈ సేవలను వినియోగించచుకోవచ్చని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సంబంధిత భక్తులకు 200 గ్రాముల ప్రసాదం, అమ్మ వారి ఫొటో, పసుపు,కుంకుమ అందజేస్తామని చెప్పింది. బుకింగ్ పాయింట్ నుంచి 200 కిలోమీటర్ల వరకు రూ.400, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.450 చార్జీలు వసూలు చేస్తామంది. మేడారం తరలించేందుకు ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు బస్ స్టేషన్లలో భక్తుల నుంచి బెల్లం సేకరిస్తారు. ఇతర వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040–30102829, 040–68153333, లేదా www.tsrtc.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని ఆర్టీసీ సూచించింది.
ఇది చదవండి: సహజనటి జయసుధకు కరోనా పాజిటివ్..!
ఇక సమ్మక్క-సారలమ్మ జాతరను మూడు ఘట్టాలుగా చెప్పుకోవచ్చు అందులో మొదటి ఘట్టం మొదటి రోజు సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెలపై కొలువుతీరి భక్తుల పూజలను అందుకున్నారు. ఇక రెండో ఘట్టంగా సమ్మక్క తల్లి రెండో రోజు గద్దెపైకి కొలువుతీరి భక్తులకు దర్శన భాగ్యం అందించి వారు కోరిన కోరికులు తీరుస్తుంది.
ఈ నేపథ్యంలోనే భక్తులు అమ్మవార్లకు తీరొక్క మొక్కులు చెల్లిస్తారు. అమ్మవార్లను తమ ఆడపడుచుగా కొలిచి పసుపు, కుంకుమ, చీర సారెలను అందించి అమ్మవారి ఆశీర్వాదాలను అందుకుంటుంటారు. ఈ జాతరలో చివరి ఘట్టం వన దేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు సాయంత్రం వనప్రవేశం చేస్తారు.
ఇది చదవండి: బిగ్ బాస్ సరయు అరెస్టు.. పోలీసుల అదుపులో బోల్డ్ బ్యూటీ
ఈ కార్యక్రమాన్నిగిరిజన పూజారులు దగ్గరుండి నిర్వహిస్తారు. ముందుగా వనదేవతలకు పూజలు చేసి ఆపై సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరునాగారం మండలం కొండాయికి, సమ్మక్కను మేడారం దగ్గర్లోని చిలకలగుట్టపైకి తీసుకెళ్తారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వేచిచూస్తారు.