జూబ్లీహిల్స్లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బోర్డ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆరోగ్య దృష్ట్యా వారికి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. ఆరోగ్య శ్రీ అనేది తెలంగాణలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరోగ్య బీమా పథకం. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబీకులు దీనికి అర్హులే. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు ఆస్పత్రిలో అవసరమయ్యే శస్త్ర చికిత్సకు సంవత్సరానికి రెండు లక్షల చొప్పున బీమా పొందవచ్చు. కొన్ని ఆపరేషన్స్ ఆరోగ్య శ్రీ కవరేజ్లోకి వస్తాయి. వాటికి డబ్బులు చెల్లించనవసరం లేదు. అయితే ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో మంత్రి హరీశ్ రావు బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం..
నిన్న మంగళవారం జూబ్లీహిల్స్లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో బోర్డ్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్య శ్రీ పరిమితి 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచిన దృష్ట్యా.. కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను రూపొందించి, స్థానికి ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాలోని లబ్ధిదారులకు అందిచాలని తెలిపారు. దీనికోసం లబ్ధిదారుల eKYC ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఆరోగ్య శ్రీ కేసుల మెడికల్ ఆడిట్.. నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్లతో నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కోవిడ్ టైంలో రికార్డ్ స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు కోఠి ఈఎన్టీ ఆస్పటల్ నిర్వహించింది. అందుకుగాను రూ. ఒక కోటి 30 లక్షలు ఎడిషినల్ సపోర్ట్గా అందించనున్నట్లు ప్రకటించారు. మూగ, చెవిటి పిల్లలకు ట్రీట్మెంట్ అందించే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ఇప్పుడు కోఠి ఈఎన్ టీ ఆస్పత్రిలో ఉచితంగా అందించబడుతోందని అన్నారు. ఇదేవిధంగా వరంగల్ MGM ఆస్పత్రిలో కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రజల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను 103కు పెంచింది. నియోజకవర్గ పరిధిలోనే డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి కిడ్నీ పేషెంట్స్కు మేలు చేకూర్చిందని తెలిపారు. మరికొంత నాణ్యమైన డయాలసిస్ సేవలను అందించేందుకు ఆన్ లైన్ లో పర్యవేక్షణ చేసేలా సాఫ్ట్వేర్ను తయారుచేసి.. వినియోగించడానికి బోర్డు అనుమతించిందన్నారు. ఆరోగ్య శ్రీ పేషెంట్లకు ఫేస్ రికగ్నేషన్ సాఫ్ట్వేర్ వినియోగానికి ఈ సమావేశంలో సమ్మతించారు. బయోమెట్రిక్ పద్ధతితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నందున పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.