మత్య్సకారులకు చేపల వేటే జీవనోపాధి. ఉదయం లేచినది మొదలు వలతో నదుల, చెరువులపై వైపు వాళ్ల పయనం సాగుతుంటుంది. అలా రోజూ చేపలు పట్టి జీవనాన్ని సాగిస్తుంటారు. అయితే అలా చేపల వేటకు వెళ్లిన సమయంలో వాళ్లకు కొన్ని సార్లు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా ఓమత్స్యకారుడికి అలానే ఓ వింత అనుభవం ఎదురైయింది. చేపల కోసం వలవేస్తే.. భారీ మొసలి పడింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈఘటన జగిత్యాల జిల్లా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామశివారులోని పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు శుక్రవారం కొందరు మత్స్యకారులు వెళ్లారు. చేపల పట్టే క్రమంలో చెరువులోకి వల విసిరారు. కొంత సమయం తరువాత వలను లాగుతుండగా..వారికి వల బరువుగా ఎక్కువ అనిపించింది. పెద్ద చేపే పడిందని అనుకున్నారు అంతా.. ఈ క్రమంలో బయటకి లాగి చూసే సరికి.. అంతా షాక్. ఎందుకంటే చేపల కోసం వేసిన వలలో ఓ పెద్ద మెుసలి చిక్కింది. చివరికి దానిని ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు అటవీ అధికారులు సమాచారం ఇచ్చారు.
సిబ్బందితో కలిసి అక్కడి చేరుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్.. ఆ మొసలి తీసుకెళ్లారు. సమీపంలోని గోదావరి నదిలో విడిచి పెట్టారు. ఆ మొసలి వయస్సు సుమారు రెండేళ్లు ఉంటుందని, దాదాపు అరవై కేజీల బరువుంటుందని ఆయన తెలిపారు. అయితే, గ్రామ చెరువులో తొలిసారి మొసలి ప్రత్యక్షం కావడంతో మత్స్యకారులు కొద్దిగా ఆందోళన చెందారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.