దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదం మొన ఒడిశాలో జరిగింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఇలా నాలుగుసార్లు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. మొన్న ఒడిశా రైలు ప్రమాదంలో కొన్ని వందల మంది ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తెలంగాణ రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మార్గంలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటన అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం పగటిపూట జరగడంతో ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించారు.
ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు ప్రమాదం జరగడం ఇది నాలుగోసారి. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ గత 29 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. మొదటిసారి 2013లో ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగలగిరి వద్ద రైలు బోగీలకు, ఇంజిన్కు మధ్యనున్న లింక్ తెగిపోయింది. ఆ సమయంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం 2015లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్కు పెద్ద ప్రమాదం తప్పింది. హౌరాలో ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు పెట్టారు. రైలులో ఓ సిలిండర్ కనిపించింది. ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిలిండర్ను తనిఖీ చేశారు. తనిఖీలో అది బాంబు అని తేలింది. దీనిని బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబును నిర్వీర్యం చేశారు.
దాని తర్వాత 2022 మార్చి 26న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ట్రైన్ నడుస్తున్న సమయంలో రైలు నుంచి మూడు బోగీలు విడిపోయాయి. కిలోమీటర్ ముందుకు వెళ్లిన ఇంజిన్కు బోగీలను అమర్చారు. దాని తర్వాత 2023 జూన్ 7న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి ప్రమాదానికి గురైంది. రన్నింగ్ ట్రైన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగీలలో దట్టమైన పొగ అలముకుంది. మంటలు చూసిన ప్రయాణికులు చైన్ లాగారు. రైలు ఆగిన వెంటనే అందరు అప్రమత్తమై బోగిల నుండి బయటకు వచ్చి ప్రాణాలను కాపాడుకున్నారు. ఇలా నాలుగుసార్లు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.