తెలంగాణలో గత ఐదు నెలల నుంచి ఉత్కంఠంగొ కొనసాగుతున్న హూజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం నేడు తేలబోతుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్ లో బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నారు. అయితే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి బీజేపీ కండువ కప్పుకున్న తర్వాత అధికార పార్టీ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లింది. ఇందులో ముఖ్యంగా ‘దళితబంధు’ పథకం. గతంలో ‘రైతుబంధు’ పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే అధికార పార్టీ వ్యూహాల ప్రకారం ఈ పథకం అమలు తో కొంత వరకు ఓట్లు దండుకోవొచ్చు అన్న ఆలోచనలో ప్రతిక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. అయితే దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని సీఎం అంటూ వస్తున్నారు. అయితే దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శాలపల్లి గ్రామంలో ఎంతో అట్టహాసంగా ప్రకటించారు.
శాలపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించడం వెనుక అధికార పార్టీ వ్యూహాలు బాగానే ఉన్నాయి.. ఇక్కడ ఓటు శాతం కూడా బాగానే ఉండటంతో మొదట ఇక్కడే ‘దళితబంధు’ పథకాన్ని ప్రకటించారు సీఎం కేసీఆర్. అంతే కాదు ఇక్కడ టీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా బాగానే ప్రచారాలు చేశారు. అయితే అధికార పార్టీ అంచనాలు తలకిందులుగా చేస్తూ.. సీఎం అట్టహాసంగా దళితబంధును ప్రకటించిన శాలపల్లిలో బీజేపీకి ఎక్కువ ఓట్లు నమోదు కావడం టీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చింది. ఇక్కడ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాలేదని చెప్పకనే చెప్పినట్లు రిజల్ట్ ద్వారా కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 910 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.