ప్రపంచం సాంకేతిక రంగంలో ఎంతో ముందడుగు వేసినా జనాలకు మాత్రం దేవుడు అంటే భక్తి.. దెయ్యం అంటే భయం ఇంకా పోలేదని చెప్పాలి. సాధారణంగా నాగుపాము అంటే ఎవరికైనా వెన్నుల్లో వణుకు పుడుతుంది.. పాము ఉన్న పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాలంటే చచ్చేంత భయం. అయితే పాముల పై ఎన్నో సినిమాలు, సీరియల్స్ వచ్చిన విషయం తెలిసిందే. నాగుపామును కుల దైవంగా కొలుస్తారు.. పేర్లు పెట్టుకుంటారు. ప్రతి గుడిలో నాగదేవతకు సంబంధించిన విగ్రహాలు తప్పనిసరిగా ఉంటాయి.
దేశ వ్యాప్తంగా నాగుల చవితి ఎంతో వైభవంగా జరుపుతుంటారు.. ఆ రోజుల పట్టణాలు, గ్రామాల్లో పుట్ట వద్దకు వెళ్లి పాలు పోస్తారు, గుడ్లు సమర్పించుకుంటారు మహిళలు. తాజాగా కరీంనగర్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి విచిత్ర ప్రవర్తన అందరికీ షాక్ ఇస్తుంది. తనని నాగ దేవత ఆవహించిందని.. తాను నాగ కన్యగా మారిపోయానని…తన శరీరంపై గీతలు కూడా పడుతున్నాయని.. తనకు వెంటనే గుడి కట్టించాలని.. నాగు పాములా వింతగా ప్రవర్తించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా అయ్యింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాబాద్ మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.
సైదాబాద్ మండలంలో ఎగ్లాస్ పూర్ కి చెందిన కృష్ణవేణి అనే యువతికి డిగ్రీ పూర్తి చేసుకుంది. కొంతకాలం ఖాళీగా ఉన్న ఆమె ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా చేరింది. ఇటీవల కృష్ణవేణి తల్లిదండ్రులు తీవ్ర అనారోగ్యంతో చనిపోయారు. దీంతో కొంతకాలం డిప్రేషన్ లో ఉన్న నాగమణి నాయనమ్మ ఇంటి వద్ద ఉంటుంది. తాను నాలుగు సంవత్సరాల క్రితం నాగకన్యగా మారిపోయానని.. ప్రతిరోజూ తన కలలో పాములు కనిపిస్తున్నాయని.. గ్రామ శివారులో ఉన్న నాగదేవత గుడి శిథిలావస్థలో ఉందని.. వెంటనే అక్కడ గుడి కట్టించాలని అప్పుడే తనలో ఉన్న నాగదేవత తనను వీడిపోతుందని గ్రామస్థులతో తెలిపింది.
ప్రతిరోజూ గ్రామ శివారులో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేయడం అక్కడే నాగుపాములా డ్యాన్స్ చేయడం లాంటివి చేస్తున్న కృష్ణ వేణిని చూసి గ్రామస్థులు భయపడిపోతున్నారు. కొంతమంది ఆమెకు నిజంగానే నాగదేవత పూనిందని అంటుంటే.. మరి కొంతమంది అదేం లేదు.. ఆమె మానసిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల అలా వింతగా ప్రవర్తిస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.