అనారోగ్యంతో బాధ పడుతున్న పేదవారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. అయితే చికిత్స పొందుతున్న వారికి సహాయకులు కూడా వస్తుంటారు. వారు భోజనం కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. భోజనం కోసం చేసే ఖర్చులు వారికి భారంగా మారుతున్నాయి. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. వారి భోజన ఖర్చులు ప్రభుత్వమే భరించి వారికి కొంత ఊరటనివ్వాలని భావించింది.
హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగుల సహాయకుల కోసం 5రూపాయలకే రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని మూడు పూటలా అందించేందుకు Government hospitals తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తగిన కార్యాచరణను రూపొందించింది. తొలివిడతగా జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రధాన ఆసుపత్రుల దగ్గర ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తోంది. రోజుకు దాదాపు 55 వేల మందికి భోజనాలను రోగుల సహాయకులకు అందించనుంది. దీని ద్వారా రోజుకు 18,600 మందికి లబ్ది చేకూరనుంది.
పేద, మధ్య తరగతి రోగుల గురించి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 38.66కోట్ల అదనపు భారం పడనుంది.ఆర్ధికంగా వెనుకబడిన, పేదల సౌక్యం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఈ తరహా సదుపాయం కోసం హరే కృష్ణ మూవ్మెంట్ స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. పది రోజుల్లో ఈ 5రూపాయల భోజనం సదుపాయం అందుబాటులోకి రానుంది.
అలా 15రూపాయలకు మూడు పూటల రుచికరమైన భోజనం అందిస్తామని హరేకృష్ణ స్వచ్చంద సంస్థ సీఈవో కాంతేయదాస ప్రభు తెలిపారు. ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజిటెబుల్ పలావ్, సాంబార్ రైస్తో పాటు పచ్చడిని టిఫిన్గా అందిస్తారు. ఇక మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో అన్నం, సాంబార్, లేదా పప్పు, పచ్చడి, సబ్జీని రోగి బంధువులకు వడ్డిస్తామని పేర్కొన్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హైదరాబాద్ లోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ప్రభుత్వం 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టాలని నిర్ణయించిందని వైద్యారోగ్య శాఖమంత్రి శ్రీ హరీష్ రావు గారు తెలిపారు. దీనికి సంబధించి హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్, ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. pic.twitter.com/SLfX5f5v8w
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) April 19, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.