యూట్యూబ్ మాధ్యమాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. దీని ద్వారా తమకు ఇష్టమైన వీడియోలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకోస్తుంది. ఈ క్రమంలో ఓ కొత్త ఫీచర్ ను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకరానుంది. అది ఏమిటంటే.. యూట్యూబ్ లో వీడియోలకు వాడే థంబ్ నైల్స్ చూసి.. వాటి బట్టి వీడియోలపై క్లిక్ చేస్తుంటాం. తీరా ఓపెన్ చేశాక అందులో సరైన వీడియో లేకపోతే విసుకుంటాము. దీంతో మన సమయం కూడా వృద్ధా అవుతుంది. దీనికి చెక్ పెట్టడానికే యూట్యూబ్ కొత్త ఫీచర్ తీసుకురానుంది.
ఇన్నిరోజులుగా ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఫీచర్ రెగ్యూలర్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకరానుంది. ఈ ఫీచర్ వలను యూజర్ల టైమ్ సేఫ్ అవుతోంది. ఈ ఫీచర్ ద్వారా ఎక్కువ మంది చూసిన వీడియో పార్ట్ వరకే ప్లే ఆవుతుంది. అలా వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేకుండా, థంబ్ నైల్ చూసి మనం ఎక్స్పెక్ట్ చేసిన వీడియో వరకే మనకు కనిపిస్తుంది. మోస్ట్ రీప్లేడ్ పార్ట్ తెలిసేలా వీడియో పక్కన ప్రోగ్రెసివ్ బార్ ఉంటుంది. దాని సహాయంతో ఎక్కువ మంది చూసిన పార్ట్ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ ఫీచర్ మొబైల్, డెస్క్ టాప్ లకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై స్మార్ట్ టీవీలు, గేమింగ్ కన్సోల్ లకు కూడా అందిచనున్నారు.
ఇదీ చదవండి:అదిరే బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడి – ఎక్కువ లాభం!ఈ ఫీచర్ తో పాటు మరికొన్ని ఫీచర్లను తీసుకరానున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. వీడియోలను సబ్ సెక్షన్స్ గా విభజించేందుకు గతంలో యూట్యూబ్ వీడియో చాఫ్టర్ ఫీచర్ ను పరిచయం చేసింది. దీంతో యూజర్లు వీడియోలని తమకు నచ్చిన పార్ట్ ను ఫార్వార్డ్ చేసుకోవచ్చు. తాజాగా థంబ్ నైల్స్ విషయంలో యూజర్ల టైమ్ సేవ్ చేయడానికి ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకరానుంది. మరి.. యూట్యూబ్ తీసుకరానున్న ఈ మోస్ట్ రీప్లేడ్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.