బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ దుకాణ్. ప్రస్తుతం ఈ కంపెనీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో కాదు ఈ సంస్థలో పని చేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది.
దేశంలో ప్రస్తుత సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి. వీరిలో చదువుకొని ఖాళీగా ఉన్న మేధావులు కూడా ఉన్నారు. ఒకప్పుడు నిరక్ష్యరాస్యత సమస్య దేశంలో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు నిరుద్యోగ సమస్య అంతకు మించి అనేలా ఉంది. ఎలాంటి రంగంలోనైనా కాంపిటీషన్ విపరీతంగా ఉంది. అయినా కూడా తమ టాలెంట్ తో కష్టపడి కొంతమంది ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. అయితే ఇక భవిష్యత్తులో వారికి కూడా నిరాశ తప్పేలా కనిపించడం లేదు. తాజాగా ఒక కంపెనీలో ఏకంగా 90 శాతం మంది ఉద్యోగులను తీసేసారు. ఒక్కరో ఇద్దరో అయితే పర్లేదు ఏకంగా 90 శాతం అంటే షాక్ కి గురి కావాల్సిందే. అయితే దానికి కారణం తెలిస్తే మాత్రం వామ్మో అనాల్సిందే. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
బెంగళూరు కేంద్రంగా సేవలందిస్తున్న ఇ-కామర్స్ స్టార్టప్ కంపెనీ దుకాణ్. ప్రస్తుతం ఈ కంపెనీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటో కాదు ఈ సంస్థలో పని చేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులను తొలగించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే దీనికి కారణం ఏఐ లు కావడం విశేషం. తొలగించిన ఉద్యోగాలని ఏఐతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈఓ సుమిత్ షా స్వయంగా ట్వీట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఏఐ చాట్బాట్ కారణంగా ఇక్కడ పని చేస్తున్న 90శాతం మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చింది. ఇది కఠిన నిర్ణయమే అయినప్పటికీ కంపెనీ దృష్ట్యా ఖచ్చితంగా అవసరం. మా అంతిమ టార్గెట్ లాభాలను ఆర్జించడమే. అందుకే ఉద్యోగులకు కష్టంగా ఉన్నా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని సుమిత్ షా చెప్పారు.
ఇదిలా ఉండగా ఇలా చేయడం వలన కలిగిన ప్రయోజనాన్ని కూడా తెలియజేసారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కంపెనీ ఖర్చుచేసే మొత్తం 85 శాతం తగ్గిందని అన్నారు. అలానే ఒక యూజర్ కి సేవలను అందించే సమయం రెండు గంటల నుంచి మూడు నిమిషాలకు తగ్గిందని సుమిత్ షా తెలియజేసారు.చాట్జీపీటీ, ఏఐ వంటివి మరింతగా రావడంతో ఇప్పుడు ఉద్యోగుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ నేపథ్యంలో రానున్న కాలంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. వీరి స్థానాల్లో ఏఐ బాట్స్ ను భర్తీ చేసుకుంటాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు కంపెనీలు ఈ విధానాన్ని అమలు పరిచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత్లో ఓ మీడియా ఛానెల్ యాజమాన్యం దేశంలోనే తొలిసారిగా ఏఐ యాంకర్ను ప్రవేశపెట్టిన విష్యం తెలిసిందే. మొత్తానికి ఓ కంపెనీ తమ సంస్థలో 90శాతం మంది ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐ బాట్స్ను భర్తీ చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.