టెక్నాలజీ పరంగా 2G, 3G నెట్ వర్క్స్ పని ఎప్పుడో ముగిసింది. కానీ ఇప్పుడు 4G నెట్ వర్క్స్ టైం కూడా ముగిసినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే 4G ఉన్నప్పుడే జనాలు 5G గురించి ఎదురు చూడటం ప్రారంభించారు. ఇప్పుడు ఏకంగా 5G నెట్ వర్క్ వచ్చేసింది. సరే నెట్ వర్క్ వచ్చింది.. మరి బడ్జెట్ ధరలో 5G మొబైల్స్ రాలేదేంటని వెయిట్ చేసాం. కానీ ఇకపై 5G స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేసే అవసరం లేదని అంటోంది మోటరోలా కంపెనీ.
అవును.. ఎందుకంటే తాజాగా మోటరోలా భారత్ లో 5G స్మార్ట్ ఫోన్ Moto G51 5G ని ఆవిష్కరించింది. సామాన్యులు కొనుగోలు చేసే బడ్జెట్ ధరలో 12 గ్లోబల్ 5G బ్యాండ్స్ సపోర్ట్ తో.. నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 వంటి బెస్ట్ ఫీచర్లతో మోటో ఈ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ Flipkart ద్వారా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ 5G ప్రోసెసర్ తో రూపొందిన ఫస్ట్ మొబైల్ గా మార్కెట్ లో అడుగుపెట్టింది.
మోటో జి51 ధర చూసినట్లయితే.. Flipkart లో కేవలం రూ.14,999/- ధరకు అందుబాటులోకి రానుంది. ఇది 4GB RAM – 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. అలాగే ఈ న్యూ మోడల్ ఇండిగో బ్లూ, బ్రెట్ సిల్వర్ కలర్ లలో లభించనుంది.
మోటో జి51 ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.8 ఇంచెస్ FHD+ డిస్ ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 480 ప్లస్ ఆక్టాకోర్ ప్రాసెసర్ తో రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ Dolby Atmos సౌండ్ సిస్టం సపోర్ట్ చేయనుంది.
కెమెరాలు చూసుకుంటే.. మోటో 5G G51 క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరా(50MP మెయిన్ – 8MP వైడ్ డెప్త్ – 2MP మైక్రో సెన్సార్) కలిగి ఉంటుంది. అలాగే 13MP సెల్ఫీ కెమెరా. ఈ మోటో మొబైల్ 5000 mAh బ్యాటరీతో 20W ర్యాపిడ్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. ఇదే మొబైల్ IP52 వాటర్ రెలెవెంట్ డిజైన్స్ తో త్వరలో మరిన్ని మోడల్స్ మార్కెట్ లోకి రాబోతుంది. ఇక ఈ 5G మోటో స్మార్ట్ ఫోన్ సేల్ డిసెంబర్ 16న మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart లో ప్రారంభం కాబోతుంది. ఈ మొబైల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపవచ్చు.