2014 లో తొలిసారి ఆర్సీబీ జట్టులో చేరి ఎన్నో విజయాల్లో చాహల్ కీలక పాత్ర పోషించాడు. 2022లో బెంగళూరు జట్టు చాహల్ ని రిటైన్ చేసుకోకపోగా వేలంలో కూడా పట్టించుకోలేదు. దీంతో ఆర్సీబీ తనను మోసం చేసిందని తెలిపాడు.
ఐపీఎల్ లో యుజ్వేంద్ర చాహల్ కి బెంగళూరు కి విడదీయరాని బంధం ఉంది. 2014 లో ఆర్సీసీబి జట్టులో తొలిసారిగా చేరాడు. అప్పట్లో చూడడానికి చాలా సన్నగా కనపడిన ఈ లెగ్ స్పిన్నర్ ని చూసి.. అందరూ ఎవడ్రా వీడు అనుకోని నవ్వుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ బెంగళూరు జట్టులో బెస్ట్ స్పిన్నర్ గా మారాడు. ఇక రాను రాను ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ గా రాటుదేలాడు. 2015 , 2016 సీజన్లలో 20 కి పైగా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక అప్పటినుంచి బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్ గా మారిపోయాడు. దాదాపు ప్రతి సీజన్లో తనదైన బౌలింగ్ తో చెలరేగే చాహల్ 2021 ఐపీఎల్ లో నిర్వహించిన వేలంలో రాజస్థాన్ జట్టుకి వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా.. తాజాగా చాహల్ తన మనసులోని బాధని బయట పెట్టాడు. ఆర్సీబీ యాజమాన్యం తనని మోసం చేసిందని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో గతేడాది కొత్తగా రెండు జట్లను చేర్చాలనే ఉద్దేశ్యంలో ప్లేయర్లందరిని మళ్ళీ కొత్తగా వేలంలోకి తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక జట్టు అప్పటివరకు ఉన్న ప్లేయర్లలో గరిష్టంగా నలుగురు ప్లేయర్లను తీసుకోవాలి అనే నిబంధన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ టీమ్ విరాట్ కోహ్లీతో పాటు మ్యాక్స్ వెల్, సిరాజ్ లను తీసుకుంది. ఇంకో ప్లేయర్ ని తీసుకునే అవకాశమున్న ప్రధాన స్పిన్నర్ చాహల్ ని పక్కన పెట్టేసింది. దీంతో ఆక్షన్ లో చాహల్ ని రాజస్థాన్ జట్టు తీసుకుంది. ఇక తొలిసారి రాజస్థాన్ జట్టులోకి చేరి చాహల్ పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే క్యాప్ ) అందుకున్నాడు. అయితే ఆర్సీబీ జట్టు తరపున ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాహల్ ని ఆ జట్టు పక్కన పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఆర్సీబీ నన్ను రిటైన్ చేసుకోలేదని తెలిసి చాలా బాధ పడ్డాను. 2014 నుంచి ఆర్సీబీ తో నా ప్రయాణం మొదలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ నా మీద చాలా నమ్మకం ఉంచాడు. 2022 వేలానికి ముందు నేను ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశానని నా మీద విమర్శలకి నేను క్లారిటీ ఇచ్చాను. ఆ జట్టు తరపున 140 మ్యాచులాడాను. చిన్నస్వామి స్టేడియం అంటే నాకు చాలా ఇష్టం.ఆర్సీబీ నన్ను ఎందుకు రిటైన్ చేసుకోలేదో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు. రిటైన్ చేసుకోకపోయినా వేలంలో ఖచ్చితంగా తీసుకుంటామని మాట ఇచ్చారు. కానీ వేలంలో వారు కనీస ప్రయత్నం చేయకపోగా.. ఆ తర్వాత వారి నుండి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. ఏది జరిగినా మన మంచికే అంటారు. రాజస్థాన్ జట్టు తరపున నేను డెత్ బౌలర్ గా మారాను. ఆర్సీబీ జట్టులో ఉన్నప్పుడు 16, 17 ఓవర్లకే నా కోటా పూర్తయ్యేది. రాజస్థాన్ జట్టులోకి చేరిన తర్వాత నా ప్రదర్శన 5-10 శాతం ఇంప్రూవ్ అయింది. అని ఈ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. మరి చాహల్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.