డబ్ల్యూఎఫ్ఐ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ తమను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నారని.. తాకరాని చోట తాకుతూ మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని మహిళా రెజ్లర్లు తీవ్ర ఆరోపణలు చేస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ ఐ) కి వ్యతిరేకంగా పలువురు రెజ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. సామాఖ్య అధ్యక్షుడు అయిన బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్.. కొంతకాలంగా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని రెజ్లర్ల ప్రధాన ఆరోపణ. తమ ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పోలీసులతో అణచివేయాలని చూస్తుందని తీవ్ర నిరాశతో ఒకదశలో వీరంతా మెడల్స్ ని గంగానదిలో కలిపేందుకు కూడా సిద్దయ్యారు. పలువురు జోక్యం చేసుకొని ఆ ప్రయత్నాన్ని విరమింపజేశారు. రెజ్లర్ల ఆందోళన తీవ్ర తరం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దబాటు చర్యలకు దిగింది. ఈ క్రమంలో రెజ్లర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
డబ్ల్యూఎఫ్ఐ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ గత కొంతకాలంగా మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు తెగబడ్డారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, రవి దహియా ఆందోళన కు పలువురు క్రీడాకారులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల ధర్నా రోజు రోజుకీ తీవ్రమవుతూ వచ్చింది. ఈ క్రమంలో రెజ్లర్లు తమ మెడల్స్ ని గంగానదిలో కలిపేస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై హూం శాఖామంత్రి అమిత్ షా స్పందించి.. రెజ్లర్లతో సమావేశం అయ్యారు.. కానీ అది అసంతృప్తిగానే ముగిసింది. తాజాగా కేంద్ర క్రీడాశాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రెజ్లర్లు డబ్ల్యూఎఫ్ఐ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ తొలగించి మహిళను నియమంచాలి, లైంగిక వేధింపులకు తెగబడిన బ్రిజ్ భూషన్ ని అరెస్ట్ చేయాలి, బ్రిజ్ భూషన్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రెజ్లింగ్ సమాఖ్యలో భాగం కారాదు, ఆందోళన సమయంలో తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి, పాలక మండలి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి అంటూ 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
ఈ డిమాండ్లపై ప్రభుత్వం తో చర్చించేందుకు ఈ నెల 15 వరకు గడువు కావాలని.. అప్పటివరకు ఆందోళన విరమించాలని ఆందోళన విరమించాలని రెజ్లర్లకు మంత్రి అనురాగ్ ఠాకూర్ సూచించడంతో సానుకూలంగా స్పందించిన రెజ్లర్లు ఈ నెల 15 వరకు తమ ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు తీవ్రస్థాయిలో ఆందోళన చేసిన రెజ్లర్లు మంత్రితో సమావేశం తర్వాత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంపై ప్రాధానత్య సంతరించుకుంది.