ఆసియా కప్ 2022.. భారత్ కు ఓ పీడకలే.. దారుణ వైఫల్యంతో టోర్నీ నుంచి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టీం యాజమాన్యంపై అలాగే ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో టీమిండియా సెలక్షన్ కమిషన్.. జట్టు కూర్పులో పునరాలోచనలో పడాల్సిన సమయం వచ్చిందని క్రీడా నిపుణులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి ఓ యువ ఆటగాడి పేరు ప్రస్తావనలోకి వస్తోంది. అతడే ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా.. కేఎల్ రాహుల్ స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే IPL లో తనదైన ముద్ర వేసుకున్న ఈ యువ ఆటగాడు.. తాజాగా జరుగుతున్న దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ తరపున దుమ్ము రేపుతున్నాడు. దీంతో అతడిని జట్టులోకి తీసుకోవాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పృథ్వీ షా.. ఈ పేరు వినగానే అందరికి వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుకు వస్తాడు. ఎందుకంటే పృథ్వీ షా కూడా సెహ్వాగ్ లాగే చాలా దూకుడైన బ్యాటర్. అదీ కాక అతడి ఆటలో సెహ్వాగ్ మనకు స్పష్టంగా కనిపిస్తాడు. ఉన్నంత సేపు బౌలర్లపై నిర్దాక్ష్యణంగా విరుచుకుడు పడతాడు. ఈ క్రమంలోనే అతడు IPLలో ఆడిన విధానం మనందరికి తెలిసిందే. తాజాగా స్థానిక టోర్నమెంట్ అయిన దులీప్ ట్రోఫీలో కూడా అతడు తన దూకుడుని కొనసాగిస్తున్నాడు. వెస్ట్ జోన్ తరపును ఆడుతున్నషా.. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అసలు అతడు ఆడుతున్నది టెస్టు క్రికెట్ ఆ.. లేదా టీ 20 నా.. అని చూసే వారే ఆశ్చర్య పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షా 121 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్ లతో 113 పరుగులు చేశాడు. యశస్వీ జైస్వాల్ తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. ఇక షాకు ఫార్మాట్ ఏదైన ఒక్కటే.. అనే విధంగా అతడు తన ఆటను ఆడుతాడు.
అయితే ఇప్పుడు సెలక్టర్ల కన్ను షా మీద పడినట్లు తెలుస్తోంది. జట్టులో సీనియర్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాహుల్ బ్యాటింగ్ పవర్ చాలా తగ్గిపోయింది. అదీ కాక మునపటిలా అతడు తన బ్యాట్ కు పని చెప్పడం లేదు. పైగా పవర్ ప్లే ఓవర్లలో అయితే మరీ దారుణంగా రన్స్ సాధిస్తున్నాడు. దీంతో అతడిని పక్కన పెట్టి IPL లో ఓపెనర్ గా అనుభవం ఉన్న షాను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది అన్నది యాజమాన్యం ఆలోచన. మరి జట్టుకు వైస్ కెప్టెన్ గా సేవలు అందిస్తున్న కేఎల్ రాహుల్ ని తొలగించి యువ ఆటగాడికి ఛాన్స్ ఇవ్వడం అనేది ఎంత వరకు జరుగుతుందో వేచిచూడాలి. ఈ నేపథ్యంలోనే పృథ్వీ షా కెరీర్ చూస్తే అతడి దూకుడు కనిపిస్తుంది. అతడు నిఖార్సైన టీ20 ఆటగాడు అని అతడి స్ట్రైక్ రేట్ చూస్తేనే అర్ధం అవుతుంది.
అతడి కెరీర్ ను ఒక సారి పరిశీలిస్తే.. 5 టెస్టు మ్యాచ్ లు ఆడిన షా 42.4 యావరేజ్ తో 339 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతడి స్ట్రైక్ రేట్ 86.0 ఉండటం విశేషం. వన్డేల్లో 113.8 స్ట్రైక్ రేట్ తో 6 ఇన్నింగ్స్ ల్లో 189 రన్స్ సాధించాడు. ఇక IPL విషయానికి వస్తే అతడి దూకుడు ఎక్కువగానే ఉంది. 63 మ్యాచ్ ల్లో 147.4 స్ట్రైక్ రేట్ తో 1588 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే షా అద్బుతమైన టీ 20 ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి పవర్ ప్లేలో పరుగులు చేయడానికి కేఎల్ రాహుల్ ఇబ్బంది పడుతున్న తరుణంలో పృథ్వీ షా లాంటి ఆటగాడు ఎంతైనా భారత జట్టు కు అవసరమే. ఈ నేపథ్యంలోనే దులీప్ ట్రోఫీలో పరుగులు సాధిస్తున్న షాకు త్వరలోనే జట్టు నుంచి పిలుపు రావడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి కేఎల్ రాహుల్ స్థానంలో డాషింగ్ బ్యాటర్ షాను తీసుకోవాలి అనే ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.