డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా చివరి రోజు భారత్ విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడడం చాలా కీలకం. అభిమానులు అందరూ కోహ్లీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇంత టెన్షన్గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రాంలో ఒక క్రిప్టిక్ పోస్టు పెట్టాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా చివరి రోజు భారత్ భారీ టార్గెట్ తో దిగబోతుంది. నాలుగో రోజు 8 వికెట్లను 270 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్ లో ఆధిక్యం కలుపుకొని 444 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకి 164 పరుగులు చేసింది. గ్రీజ్ లో కింగ్ విరాట్ కోహ్లీ, రహానే ఉండగా.. చివరి రోజు భారత్ విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆశలన్నీ కోహ్లీ, రహానే పైనే ఉన్నాయి.ఇదిలా ఉండగా కోహ్లీ చేసిన క్రిప్టిక్ పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.
చివరి రోజు భారత్ విజయం సాధించాలంటే విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడడం చాలా కీలకం. అభిమానులు అందరూ కోహ్లీ మీదే ఆశలు పెట్టుకున్నారు. ఇంత టెన్షన్గా ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రాంలో ఒక క్రిప్టిక్ పోస్టు పెట్టాడు. ‘మనకు వర్రీలు, అనుమానాలు, భయాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్నిసార్లు అన్నీ వదిలేయడాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి’ అనే కొటేషన్ను షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్కు ఏమీ అర్ధం కాలేదు. కొంపతీసి డబ్ల్యూటీసీ ట్రోఫీ వదిలేయాలని అంటున్నావా? అని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. మరికొందరేమో ఇంత టెన్షన్లో ఇంకా టెన్షన్ పెంచే పోస్టులు ఎందుకు బాస్? అని నిలదీస్తున్నారు. ఈ కోట్ షేర్ చేయడం వెనుక కోహ్లీ ఆలోచన ఏంటో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
ఇక ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కి ఓటమి తప్పేలా కనిపించడం లేదు. భారీ ఆశలు పెట్టుకున్న కోహ్లీని బొలాండ్ పెవిలియన్ కి చేర్చి టీమిండియాకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఆ మరుసటి బంతికి జడేజాని అవుట్ చేసాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ప్రస్తుతం భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. కోహ్లీ ఏ మ్యాచులో నిరాశ పర్చడం ఇప్పుడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆఫ్ సైడ్ దూరంగా వెళ్లే బంతులని వెంటాడి మరోసారి మూల్యం చెల్లించుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ నిన్న చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. మొత్తానికి కోహ్లీ తన మీద ఒత్తిడి తగ్గించుకోవడానికే ఇదంతా చేశాడా అనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.