టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 100వ టెస్టు సందర్భంగా సెంచరీ చేయాలనే డిమాండ్ తీవ్రంగా ఉంది. అలాగే కోహ్లీ సెంచరీ చేయక దాదాపు మూడేళ్లకు పైనే అయింది. ఈ మధ్య కాలంలో విరాట్ సరైన ఫామ్లో కూడా లేడు. అయినా కూడా టెస్టుల్లో కోహ్లీ కింగే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాకింగ్స్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి.
టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ టెస్టు బ్యాట్స్మెన్ ర్యాకింగ్స్లో టాప్లో ఉన్నాడు. అతని తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ గన్ రిషభ్ పంత్ ఉన్నారు. భారత్ నుంచి ఈ ముగ్గురు మాత్రమే టాప్ 10లో ఉన్నారు. ఒక మొత్తం మీదా ఆస్ట్రేలియా ఆటగాడు లబుషేన్ అగ్రస్థానంలో ఉండగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ 5వ స్థానంలో, రోహిత్ 6వ స్థానంలో ఉన్నారు. పంత్ 10వ స్థానంలో ఉన్నారు. కాగా భారత్ తరుపున టాప్10లో నిలిచిన మొట్టమొదటి వికెట్ కీపర్గా పంత్ రికార్డు సృష్టించాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా ఎప్పుడు టాప్ 10లో స్థానం సాధించలేదు. మరి ఈ ర్యాకింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఒకప్పుడు మ్యాచ్ విన్నర్ కాదన్నారు! కట్ చేస్తే.. ఇప్పుడు జడేజానే నంబర్1!
Jadeja reaches the summit 👑
Kohli, Pant move up ⬆️Some big movements in the latest update to the @MRFWorldwide ICC Men’s Test Player rankings 📈
Details 👉 https://t.co/BjiD5Avxhk pic.twitter.com/U4dfnrmLmE
— ICC (@ICC) March 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.