బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ సత్తా చాటుతోంది. పతకాల వేటలో దూసుకుపోతుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. రికార్డ్ సృష్టిస్తూ హైజంప్ విభాగంతో భారత్ కు తొలి పతకం అందించాడు ఓ అథ్లెట్. మరిన్ని వివరాల్లోకి వెళితే.. తేజస్విన్ శంకర్.. ఈ యువ హైజంపర్ జూన్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో 2.27 మీటర్ల దూరం జంప్ చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై అంచానాలు పెరిగాయి.
దీంతో కామన్వెల్త్ క్రీడల్లో కచ్చితంగా గోల్డ్ సాధిస్తాడని అందరు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే అతడు తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కాంస్యం చేజిక్కించుకుని రికార్డు సృష్టించాడు. హైజంప్ ఫైనల్స్లో శంకర్ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో హైజంప్ విభాగంతో భారత్ కు తొలి పతకం అందించిన అథ్లెట్ గా శంకర్ రికార్డ్ నెలకొల్పాడు. ఇక న్యూజిలాండ్కు చెందిన హమీష్ కెర్ 2.25 మీటర్ల జంప్చేసి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు.
ఈ క్రమంలో కాంస్య పతకం సాధించిన శంకర్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ”తేజస్విని శంకర్ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్లో హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.” అంటూ తెలిపారు.
Tejaswin Shankar creates history. He wins our first high jump medal in the CWG. Congratulations to him for winning the Bronze medal. Proud of his efforts. Best wishes for his future endeavours. May he keep attaining success. @TejaswinShankar pic.twitter.com/eQcFOtSU58
— Narendra Modi (@narendramodi) August 4, 2022
ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా శంకర్ను అభినందించారు. ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్య పతకాలతో 7వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తూ.. రికార్డు సృష్టించి పతకం సాధించిన తేజశ్విన్ శంకర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
☑️First-ever high jump medal for India at CWG
☑️First track and field medal for India in this CWG editionTejaswin Shankar🙌🏻#CommonwealthGames2022
— The Bridge (@the_bridge_in) August 3, 2022