బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో బార్బడోస్ జట్టును చిత్తుగా ఓడించి గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్ ప్రదర్శనతో మహిళా జట్టు ఔరా అనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేశారు. షఫాలీ వర్మ(43), రోడ్రిగ్స్(56*), దీప్తి శర్మ(31*) ఆకట్టుకున్నారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బార్బడోస్ జట్టు 62 పరుగులకే కుప్పకూలింది. రేణుకా సింగ్ 4/10 అద్భుత స్పెల్ తో ఆకట్టుకుంది. మేఘ్నా సింగ్, స్నేహ రాణా, రాధా యాదవ్, హర్మన్ ఒక్కో వికెట్ చొప్పు పడగొట్టారు. కామన్వెల్త్ గేమ్స్ లో టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సెమీస్ చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. A fantastic victory for #TeamIndia. They win by 100 runs and advance into the semi-finals at the #CWG2022 Scorecard - https://t.co/upMpWogmIP #INDvBAR #B2022 pic.twitter.com/uH6u7psVmG — BCCI Women (@BCCIWomen) August 3, 2022 ఇదీ చదవండి: సూర్యకుమార్ యాదవ్పై పాకిస్తాన్ ఫ్యాన్స్ అక్కసు! కారణం? ఇదీ చదవండి: టీమిండియాతో తలపడేందుకు గట్టి జట్టునే ప్రకటించిన పాకిస్థాన్!