కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్ల పతకాల పంట పండిస్తున్నారు. అలాగే హైజంప్ ఈవెంట్లో భారత్కు తొలి పతకం వచ్చింది. తేజస్విన్ శంకర్ హైజంప్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్తో సత్తా చాటి ట్రాక్ అండ్ ఫీల్డ్లో తొలి మెడల్ అందించాడు. హై జంప్ ఈవెంట్లో భారత్కు పతకాన్ని అందించిన తొలి అథ్లెట్గా చరిత్రకెక్కాడు. 2.22 మీటర్ల ఎత్తు దూకి మూడో స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 2.10 మీటర్ల హర్డిల్ను క్లియర్ చేసిన తేజస్విన్.. రెండో ప్రయత్నంలో 2.15 మీటర్లు, మూడో ప్రయత్నంలో 2.19 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 2.22 మీటర్లు క్లియర్ చేశాడు.
ఇక 2.25 మీటర్లు ఎత్తు దూకడంలో విఫలమయ్యాడు. న్యూజిలాండ్కు చెందిన హమీష్ కెర్ గోల్డ్ సాధించగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తమ్ముడు బ్రెండన్ స్టార్క్ సిల్వర్ సాధించాడు. అయితే ట్రాక్ అండ్ ఫీల్డ్లో తొలి మెడల్ అందించిన తేజస్విన్ శంకర్.. కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడానికి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియ(ఏఎఫ్ఐ)తో పోరాటమే చేశాడు. అమెరికా స్టేట్ చాంపియన్షిప్స్లో పాల్గొన్నాడని, తేజస్విన్ శంకర్ను ఏఎఫ్ఐ కామన్వెల్త్ గేమ్స్కు ఎంపిక చేయలేదు. దాంతో అతను ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించాడు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి బ్రాంజ్ మెడల్ అందుకున్నాడు.
వీధి కుక్కలతో ప్రాక్టీస్..
ఈ పతకం సాధించేందుకు తీవ్రంగా కష్టపడ్డ తేజస్విన్.. వినూత్నంగా ప్రాక్టీస్ చేశాడు. జేఎల్ఎన్ గ్రౌండ్లో ఉండే మూడు వీధి కుక్కలకు బిస్కెట్లు వేసి మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత వాటితో కలిసి హై జంప్ చేయడం మొదలెట్టాడు. వీధి కుక్కలతో పోటీపడి మరీ హై జంప్ ప్రాక్టీస్ చేసిన తేజస్విన్ శంకర్, ఎన్నో అవరోధాలు దాటుకుని కామన్వెల్త్ వేదికపై భారతదేశానికి ట్రాక్ అండ్ ఫీల్డ్లో మొట్టమొదటి పతకాన్ని అందించాడు.
A week back Tejaswin Shankar was practising in front of 3 dogs at JLN Stadium, after not being named to the CWG squad despite meeting the AFI QF standard. Included at the last minute after taking the fed to court, today in front of 30000, he wins a high jump bronze in Birmingham. pic.twitter.com/1YDiEsvjE3
— jonathan selvaraj (@jon_selvaraj) August 3, 2022
ఇది కూడా చదవండి: కామన్వెల్త్లో సత్తా చాటిన సుధీర్.. పారా పవర్ లిఫ్టింగ్లో భారత్కు మొదటి స్వర్ణం!