మరి కొన్ని గంటల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నిలో పాల్గొనబోయే అన్ని టీంలు ప్రాక్టీస్ ల్లో మునిగి పోయాయి. అయితే దీనికి భిన్నంగా భారత ఆటగాళ్లు నవ్వుతూ ఫొటోలకు ఫోజులివ్వడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటో షూట్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
క్రికెట్ ఆటలో శారీరక శ్రమ ఎక్కువ. దాంతో ఆటగాళ్లు మ్యాచ్ లకు ముందు మైదానంలో కుస్తీ పట్టాల్సి వస్తుంది. ఇక ఆటల్లో ఒత్తిడిని జయించడాని వారికి మానసిక ఉల్లాసం కూడా అవసరమే. ఈ క్రమంలోనే భారత జట్టు ఆసియా కప్ ముంగిట ఓ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటో షూట్ లో భారత ఆటగాళ్లు అంతా సందడి చేశారు. ఒక్కో ఆటగాడు కెమెరాకు తమకు నచ్చిన పోజులు ఇస్తూ తెగ ఎంజాయ్ చేశారు. వారిచ్చే స్టిల్స్ చూసి ఎదురుగా ఉన్న ఆటగాళ్లు నవ్వులు పూయించారు.
ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కొన్ని ఆటలను సరదాగా వారు ఆడుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫొటో షూట్ నంతా దగ్గరుండి మరీ చూసుకున్నాడు. రోహిత్, కోహ్లీ, జడేజా, పంత్, అశ్విన్, చహల్ ఇలా జట్టు ఆటగాళ్లంతా ఎంతో సరదాగా ఈ షూట్ ను ఎంజాయ్ చేశారు. ఆటగాళ్లకు శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం కూడా అవసరమే అని జట్టు యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇండియా బ్యాటర్లు ఈ విధంగా ఫొటోలకు ఫోజులివ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Laughter, camera, some games and more….
Behind the scenes from #TeamIndia‘s headshots session ahead of #AsiaCup2022 📽️📽️ pic.twitter.com/go8nuPWBbg
— BCCI (@BCCI) August 26, 2022