పాపం పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. అస్సలు టైం కలిసి రావట్లేదు. లేకపోతే ఏంటి.. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ లో ఘోరంగా ఫెయిలయ్యాడు. క్రికెట్ ప్రేమికులు చాలామంది అతడికి ట్రోల్ చేసి పడేశారు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాక్ జట్టు అంచనాలతోనే అడుగుపెట్టింది. బాబర్ ఆజామ్, షాహీన్ అఫ్రిది లాంటి వరల్డ్ టాప్ క్రికెటర్లు.. వీళ్ల జట్టులో ఉండటమే కారణం. తీరా మ్యాచులు జరిగిన తర్వాత చూస్తే.. మొత్తం సీనే మారిపోయింది.ఈ ఇద్దరినీ ఘోరంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు. ఇప్పుడు కూడా పలువురు టీమిండియా అభిమానులు.. బాబర్ గాలి తీసిపడేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 ప్రపంచకప్ లో టీమిండియా బాగానే ఆడినప్పటికీ, సెమీస్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే సూర్యకుమార్ యాదవ్ లాంటి అద్భుతమైన బ్యాటర్ వెలుగులోకి వచ్చాడు. టీ20ల్లో భారత జట్టుకు భరోసా కల్పించాడు. తన అసాధారణ ఇన్నింగ్సులతో అభిమానుల మనసు గెలుచుకోవడమే కాదు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లోనూ టాప్ లోకి వెళ్లిపోయాడు. ఆ ప్లేస్ లోని బాబర్ ఆజామ్ కాస్త నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం అంతా సూర్యకుమార్ హవానే నడుస్తోంది.
తాజాగా ముగిసిన న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోనూ సూర్యకుమార్ అదరగొట్టే ఫెర్ఫామెన్స్ ఇచ్చాడు. సూర్య ప్రస్తుతం, 890 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, బాబర్ ఆజామ్ మాత్రం 778 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇది పక్కనబెట్టేస్తే.. ‘రిలాక్సింగ్ అండర్ ద బ్లూ స్కై’ అనే క్యాప్షన్ తో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందిస్తున్న పలువురు నెటిజన్స్.. ‘అవును స్కై దిగువనే ఉన్నావ్’ అని ర్యాంకింగ్స్ గుర్తుచేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇదికాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. నవంబరు 25 నుంచి భారత్-న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
Relaxing under the blue sky 😎 pic.twitter.com/M78Lh9xLGJ
— Babar Azam (@babarazam258) November 23, 2022