భారత జట్టులో అత్యంత వేగంగా బంతులు వేసే ఫాస్ట్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ ఒకడు. కచ్చితైమన వేగం, నిలకడగా ఒకే లెంగ్త్లో బంతులు వేయడం అతడి స్పెషాలిటీ. అలాంటి ఉమేష్ ఇంట్లో విషాదం నెలకొంది.
టీమిండియా స్పీడ్స్టర్ ఉమేష్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొదుతున్నారు. అయితే ఆయన హెల్త్ కండీషన్ మెరుగుపడకపోవడంతో.. ఖపర్ఖేడా, మిలన్ చౌక్లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. తిలక్ యాదవ్ తన ఇంట్లో బుధవారం సాయంత్రం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక, ఉమేష్ తండ్రి తిలక్కు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన తన కొడుకు ఉమేష్ను మాత్రం పోలీసు లేదా మిలట్రీలో చేర్చాలనుకున్నారు.
ఉమేష్ యాదవ్కు మాత్రం క్రికెట్ అంటే పిచ్చి. దీంతో అతడు జెంటిల్మన్ గేమ్పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో అతడి బౌలింగ్ చూసి.. రంజీ క్రికెట్లో పిలుపొచ్చింది. అందులో అదరగొట్టడంతో భారత జట్టులో ఆడే చాన్స్ దక్కింది. అలా ఇండియన్ క్రికెట్కు ప్రాతినిధ్యం వహించాడీ స్పీడ్స్టర్. ఇకపోతే, తిలక్ యాదవ్ స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్లోని డియోరియా జిల్లా. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (ఉమేష్ యాదవ్) ఉన్నారు. బొగ్గు గనిలో జాబ్ రావడంతో నాగ్పూర్ సమీపంలోని ఖపర్ఖేడీకి వచ్చి లైఫ్ను మొదలుపెట్టారు. ఉమేష్ తండ్రి మృతిపై అతడి ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
आंतरराष्ट्रीय क्रिकेटपटूला घडवणारे हात गेले, उमेश यादवच्या वडिलांचे नागपुरात निधन#UmeshYadav #TeamIndia https://t.co/6l7jnLQFHC
— ZEE २४ तास (@zee24taasnews) February 23, 2023