సచిన్, లారా, పాంటింగ్.. క్రికెట్ లో పేరొందిన దిగ్గజాలు. వారి రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ ప్రపంచంలో వినిపిస్తోన్న ఏకైక పేరు విరాట్ కోహ్లీ. దిగ్గజాల రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు కింగ్ కోహ్లీ. 14 సంవత్సరాల తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో రికార్డులను తిరగరాస్తున్నాడు. దాంతో ఇతడి పరుగుల దాహానికి దాసోహమవని బౌలర్ లేడు అంటే అతిశయోక్తికాదు. అందుకే సగటు అభిమానులతో పాటుగా స్టార్ క్రికెటర్లు సైతం విరాట్ అభిమానులుగా మారిపోయారు. ఇప్పటికే వరల్డ్ క్లాస్ దిగ్గజాలందరు కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరిపోయాడు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్. కోహ్లీ బర్త్ డే సందర్భంగా విషెస్ తో పాటుగా ప్రశంసలు సైతం కురిపించాడు.
క్రికెట్ లో ఓ ఆటగాడు బాగా ఆడితే.. ఆ దేశంలో క్రేజ్ పెరుగుతుంది. మరీ బాగా ఆడితే పక్కదేశాల్లో ఫ్యాన్స్ పెరుగుతారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండాలంటే ఎలా ఆడాలి? విరాట్ కోహ్లీలా ఆడాలి. అవును కింగ్ కోహ్లీ ఆటకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇక కొన్నిదేశాల ప్రజలైతే ఏకంగా మా దేశానికి రండీ అంటూ ప్లకార్డులు సైతం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. దాయది దేశమైన పాక్ సైతం పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇచ్చేస్తాం.. కోహ్లీని మా దేశానికి పంపండి అంటూ అక్కడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. మరి ఇంతటి ఘనత ఉంది కాబట్టే సెలబ్రిటీలు కూడా విరాట్ కు అభిమానులుగా మారిపోయారు.
తాజాగా నవంబర్ 5న విరాట్ బర్త్ డే సందర్భంగా అతడిపై శుభాకాంక్షల వర్షం కురిసింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం విరాట్ ఆటకు ఫిదా అయ్యాడు. అతడికి బర్త్ డే విషెస్ చెప్తూనే ప్రశంసలతో ముంచెత్తాడు. కేన్ మావ కోహ్లీ గురించి మాట్లాడుతూ..”ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజాలు ఉన్నారు. కానీ నా దృష్టిలో మాత్రం నిజమైన దిగ్గజం విరాట్ కోహ్లీనే. ఈ విషయం అతడి ఆటను చూస్తేనే అర్దం అవుతుంది. విశేషమైన బ్యాటింగ్ అనుభవం అతడి సొంతం. విరాట్ బ్యాట్ నుంచి ఎన్నో రికార్డులు జాలువారాయి. వాటిని బట్టే అర్దం చేసుకోవచ్చు క్రికెట్ లో రియల్ లెజెండ్ కోహ్లీనే అని” అంటూ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు.