మునుపెన్నడూ లేనంత హోరాహోరీగా టీ20 ప్రపంచకప్ 2022 సాగుతోంది. సూపర్ -12 ముగింపు దశకు చేరినా.. ఇంకా 4 మ్యాచ్లే మిగిలే ఉన్నా.. ఒన్యూజిలాండ్ మినహా సెమీస్ చేరే మిగిలిన మూడు జట్లు ఏవన్నది తేలలేదు. శనివారం శ్రీలంక- ఇంగ్లాండ్ మధ్య జరుగుతన్న మ్యాచుతో గ్రూప్-1 నుంచి సెమీస్ చేరే మరో జట్టు ఏదన్నది తేలనుండగా, ఆదివారం జరగబోయే ట్రిపుల్ హెడ్డర్ మ్యాచులతో గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే జట్లు ఏవన్నది లెక్కలు తేలనున్నాయి. ఇదిలావుంటే.. ఈ టోర్నీలో టీమిండియా తన చివరి మ్యాచులో జింబాబ్వేతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచులో విజయం సాధించినా.. రద్దయినా ఎలాంటి లెక్కలు లేకుండా సెమీస్ కు అర్హత సాదిస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం.. ఇతర జట్ల విజయవకాశాలపై ఆధారపడాల్సిందే. ఈ నేపథ్యంలో జింబాబ్వే జట్టును తక్కువ అంచనా వేయకూడదంటూ మాజీలు సూచిస్తున్నారు.
భారత్ ముందు జింబాబ్వే పసికూన జట్టైనా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అసలే దాయాది జట్టు పాకిస్తాన్ ను మట్టి కరిపించి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. సీన్ విలియమ్స్, క్రెగ్ ఎర్విన్, సికందర్ రజా, ర్యాన్ బర్ల్, బ్రాడ్ ఇవాన్స్.. ఇలా జింబాబ్వే జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. ఇప్పటికే ఆయా ఆటగాళ్లు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో తమ సత్తా ఏంటో కూడా తెలియజెప్పారు. 130 పరుగులే చేసినప్పటికీ, పాక్ ఆటగాళ్లు దాన్ని కూడా ఛేదించలేకపోయారు. అందులోనూ టోర్నీలో ఆఖరి మ్యాచ్.. గెలిచినా.. ఓడినా.. ఎలాంటి నష్టం లేనప్పటికీ, గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. కనుక భారత ఆటగాళ్లు, జింబాబ్వే జట్టును తేలిగ్గా తీసుకోకూడదని మాజీలు హెచ్చరిస్తున్నారు.
గ్రూప్-2లో నెదర్లాండ్స్, జింబాబ్వే మినహా మిగిలిన నాలుగు జట్లు సెమీస్ రేసులో ఉన్నాయి. అగ్రస్థానంలో ఉన్న భారత్, రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా తమ చివరి మ్యాచుల్లో గెలిస్తే నేరుగా సెమీస్ చేరతాయి. భారత్ కు ఓడినా అవకాశం ఉంటుంది. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్థాన్లలో ఓ జట్టు ఓడాలి. ఒకవేళ భారత్ ఓడి.. దక్షిణాఫ్రికా, పాక్ గెలిస్తే.. దక్షిణాఫ్రికా సెమీస్ చేరుతుంది. భారత్, పాకిస్థాన్ ఆరు పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమవుతుంది. టీమిండియా (0.730) కంటే మెరుగైన రన్ రేట్ ఉన్న పాక్ (1.117) ముందంజ వేసే అవకాశం ఉంది. సెమీస్ చేరేందుకు సఫారీ జట్టుకు గెలుపు తప్పనిసరి. ఓడిపోతే పాక్ లేదా బంగ్లాకు ఆ అవకాశం దక్కుతుంది. రన్ రేట్ లో వెనకబడ్డ బంగ్లా సెమీస్ చేరాలంటే.. పాకిస్థాన్ పై ఆ జట్టు గెలవాలి. దక్షిణాఫ్రికా ఓడాలి. ఏయే జట్లు సెమీస్ లో తలపడనున్నాయన్నది రేపటితో తేలిపోనుంది.
Comment below with 🇮🇳 emoji if this points table puts up a smile on your face 🤩#OneFamily #T20WorldCup #INDvBAN @surya_14kumar @ICC pic.twitter.com/YHFx0CyarA
— Mumbai Indians (@mipaltan) November 2, 2022