టీ20 ప్రపంచకప్, పాకిస్థాన్ జట్టుకు ఏ మాత్రం కలిసిరావట్లేదు. ప్రపంచంలోనే టాప్ బౌలర్, టాప్ బ్యాటర్ ఉన్న జట్టు వరసగా రెండు మ్యాచులు ఓడిపోవడం ఏంటి? ఇక తాజాగా జరిగిన మ్యాచ్ లో అయితే పసికూన జింబాబ్వే చేతిలో 1 పరుగు తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. ఈ మ్యాచ్ విషయంలో జింబాబ్వే క్లాస్ బౌలింగ్ తో అదరగొట్టింది. అసలు అంచనాల్లేని చోట జింబాబ్వే అద్భుతం చేసింది. పాక్ చీటింగ్ చేసినా సరే మ్యాచ్ లో గెలవకపోవడం.. క్రికెట్ ప్రేమికుల మధ్య చర్చకు దారి తీసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే… పెర్త్ వేదికగా పాక్-జింబాబ్వే జట్ల మధ్య సూపర్-12 మ్యాచ్ గురువారం జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడే చాలామంది పాక్ జట్టు గెలిచేస్తుందని ఫిక్సయ్యారు. అందుకు తగ్గట్లే జింబాబ్వే ఇన్నింగ్స్ కూడా సాగింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులకే చేసింది. పాక్ బౌలర్లు అలా కట్టడి చేశారు. దీంతో దాయాది జట్టు విజయం లాంఛనమే అనుకున్నారు. కానీ చివరి వరకు సాగిన ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. పాక్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది.
ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో పాక్ చివరి ఓవర్ చివరి బంతికి చీటింగ్ చేసింది. అయినా సరే మ్యాచ్ గెలవలేకపోయింది. క్రికెట్ నిబంధనల ప్రకారం.. బౌలర్ తన వేస్తున్న బంతిని రిలీజ్ చేసేంత వరకు నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్, క్రీజ్ దాటి వెళ్లకూడదు. కానీ బ్రాడ్ ఎవాన్స్ చివరి బంతి వేస్తున్న సమయంలో షాహీన్ అఫ్రిది బ్యాటింగ్ కి సిద్ధమయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న వసీమ్ జూనియర్ మాత్రం క్రీజ్ వదిలి కొంత దూరం వెళ్లిపోయాడు. గెలవాలంటే ఒక్క బంతికి మూడు పరుగులు అవసరం… అయినా సరే ఆ బంతికి సింగిల్ మాత్రమే తీయగలిగారు. మ్యాచ్ జింబాబ్వే వశమైంది. దీంతో పాక్ జట్టు చీటింగ్ చేసిందని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
This is real cricket spirit 🤔 pic.twitter.com/UtUN3Aq8Bj
— Prof. Boies 2.0🪔 (@im_Boies45) October 27, 2022