‘అన్ని ఉన్నా ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’.. ఇది సామెత మాత్రమే. కానీ రియాలిటీలో అది కూడా పాక్ జట్టు విషయంలో జరిగేసరికి నెటిజన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కావడానికి ముందు పాక్ ఆటగాళ్లు చాలా మాట్లాడారు. తీరాచూస్తే.. జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి ఫేస్ ఎక్కడ పెట్టుకోవాలో తెలీక బిత్తరచూపులు చూస్తున్నారు. స్టార్ ప్లేయర్స్ ఉన్న పెద్ద పెద్ద జట్లే సైలెంట్ గా ఉంటున్నాయి. కానీ పాక్ మాత్రం ఎగిరెగిరి పడుతోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్, టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఉండేసరికి చాలామంది ఎగ్జైట్ అయ్యారు. అందుకు ఏ మాత్రం తీసిపోకుండా చివరి బంతి వరకు మ్యాచ్ జరిగింది. ఒకానొక సమయంలో నరాలు తెగిపోతాయేమో అనేంతలా టెన్షన్ వచ్చింది. ఏదైతేనేం కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ వల్ల పాక్ జట్టుపై మనం గెలిచేశాం. ఈ మ్యాచ్ తర్వాత పాక్ జట్టు జింబాబ్వేతో ఆడింది. అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంతో సహా మిగిలిన క్రికెటర్లు షాక్ లోకి వెళ్లిపోయారు.
ఇక పాక్ ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ అయితే పాక్ డ్రస్సింగ్ రూం ముందు కూర్చుని గుక్కపెట్టి ఏడ్చాడు! దీనికి పాక్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతారనుకుంటే.. రివర్స్ లో అతడినే ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. షాదాబ్ ఓవరాక్షన్ మొదలుపెట్టాడని, ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయి, ఏదో బాగా కష్టపడినట్లు నాటకాలు ఆడుతున్నాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇకనైనా ఈ బిల్డప్ తగ్గించుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ వరల్డ్ కప్ స్టార్ట్ కావడానికి ముందు షాదాబ్ ఖాన్ చాలా కథలే చెప్పాడు. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బౌలింగ్ లైనప్ ఉన్న టీమ్ పాకిస్థాన్ అని.. బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్ లాంటి టాప్ 2 బ్యాటర్లు పాక్ జట్టులోనే ఉన్నారని అన్నాడు. ఇప్పుడు వాటిని గుర్తుచేస్తూ ఏడవడంపై కౌంటర్లు వేస్తున్నారు.
Cricket can be so cruel sometimes.🫣😨 pic.twitter.com/dY5VXrlddM
— Avinash Aryan (@AvinashArya09) October 28, 2022