మహేంద్రసింగ్ ధోని.. ఇండియాకు రెండు ప్రపంచ కప్పులు అందించిన కెప్టెన్ మాత్రమే కాదు, ఎందరో క్రికెటర్ల తలరాతను మార్చిన క్రికెట్ మెజీషియన్. తన కెప్టెన్సీతో సాధారణ క్రికెటర్లను హీరోలుగా మార్చాడు. అలా మారిన వారిలో సామ్ కర్రాన్ కూడా ఒకడు. 2018లో ఇంగ్లండ్ టీమ్లో ఒక సాధారణ యువ క్రికెటర్గా ఉన్న ఈ కుర్రాడు. ఇప్పుడు ఆ జట్టుకు వరల్డ్ కప్ అందించిన హీరోగా ఎదిగాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో సెమీ ఫైనల్, ఫైనల్స్లో ఒత్తిడిని తట్టుకుని కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడం ఎలా సాధ్యమైందనే అనుమానం అందరిలో కలుగుతోంది. అసలు ఇంత తక్కువ గ్యాప్లో వరల్డ్ కప్ అందించే రేంజ్కి ఈ యువ ఆటగాడు ఎలా ఎదగడంపై టీమిండియా మాజీ కెప్టెన్, తలా ధోని ఎలా కీ రోల్ ప్లే చేశాడు ఇప్పుడు తెలుసుకుందాం..
పొట్టి ఫార్మాట్లో ఇంగ్లండ్ రెండో సారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022 సూపర్ 12లో ఐర్లాండ్ చేతుల్లో ఓడిన ఇంగ్లండ్.. కొంత లక్ కలిసొచ్చి సెమీస్ చేరింది. సెమీస్లో పటిష్టమైన టీమిండియాను ఏకంగా 10 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్స్లో అడుగుపెట్టింది. అదృష్టకొద్ది సెమీస్కు ఆ తర్వాత కివీస్పై విజయంతో ఫైనలకొచ్చిన పాకిస్థాన్తో తుది పోరుకు సిద్ధమైంది. సెమీస్లో టీమిండియాపై సాధించిన విజయం చూస్తే.. ఇంగ్లండ్ బ్యాటింగ్పై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. పైగా 9వ నంబర్ వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఇంగ్లండ్ సొంతం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్థాన్ను ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
తన బ్యాటింగ్పై ఉన్న నమ్మకం కొద్ది ఫీల్డింగ్ ఎంచుకున్నాడు బట్లర్. కానీ.. సెమీస్ బ్యాట్తో గెలిపించారు కదా.. ఫైనల్స్లో మా బౌలింగ్ సత్తా ఏంటో చూపిస్తామని రెచ్చిపోయాడు సామ్ కర్రాన్. పటిష్టమైన పాక్ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. పాక్ ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్, ఫామ్లో ఉన్న షాన్ మసూద్, నవాజ్లను అవుట్ చేసి పాక్ను 137 పరుగులకే కట్టడి చేసి.. ఇంగ్లండ్ బ్యాటర్లకు పెద్ద పనిలేకుండా చేశాడు. ఫైనల్ మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చిన సామ్ 3 కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. ఫైనల్స్లోనే కాక.. టోర్నీ ఆసాంతం ఇంగ్లండ్ జట్టుకు బౌలింగ్లో వెన్నుముకలా నిలిచాడు. మార్క్వుడ్ లాంటి మంచి బౌలర్ గాయంతో జట్టుకు దూరమైనా.. సామ్ మాత్రం ఇంగ్లండ్ను ముందుండి నడిపించాడు. శ్రీలంకతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లోనూ సామ్ సత్తా చాటాడు. ఈ టోర్నీలో సామ్ మొత్తం 13 వికెట్లు కూల్చి.. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.
కేవలం 24 ఏళ్ల ఈ యువ క్రికెటర్కు భారీ ప్రెషర్ను తట్టుకుని.. వరల్డ్ కప్ ఫైనల్స్లో అంత ధైర్యంగా బౌలింగ్ చేసే మెచ్యురిటీ ధోని వల్లే వచ్చిందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఎవరిలో ఎలాంటి టాలెంట్ దాగుందో గుర్తించి దాన్ని టైమ్ వచ్చినప్పుడు బయటకి తీయడంలో ధోని తర్వాతే ఎవరైనా.. అలాగే 2018లో ఇంగ్లండ్లో, 2019లో పంజాబ్ కింగ్స్ టీమ్లో సాధారణ ప్లేయర్గా ఉన్న సామ్ కర్రాన్.. 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చి.. ఎక్స్ట్రాఆర్డినరీ ప్లేయర్గా మారిపోయాడు. ధోని నేర్పిన పాఠాలతో ఒత్తిడిలో ఎలా బౌలింగ్ చేయాలో, పరిస్థితులకు తగ్గట్లు.. బ్యాటర్ వీక్నెస్పై ఎలా దెబ్బకొట్టాలనే విషయాల్లో రాటుదేలాడు. ధోని నుంచి నేర్చుకున్న విషయాలను ఈ వరల్డ్ కప్లో తూచాతప్పకుండా అములు చేసి సామ్.. అద్భుత ఫలితాన్ని రాబట్టాడు.
టీ20 వరల్డ్ కప్ 2022కు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021కి దూరమైన సామ్.. ఇప్పుడు మాత్రం ఇంగ్లండ్కు వరల్డ్ కప్ అందించిన హీరోగా అవతరించాడు. ధోని కెప్టెన్సీలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు ఆడటంతోనే సామ్ ఇంత పరిణతి చెందాడని యావత్ క్రికెట్ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. 2018లో ఇంగ్లండ్ జాతీయ జట్టులోకి వచ్చిన సామ్ను ఐపీఎల్ 2019కి గాను కింగ్ష్ ఎలెవన్ పంజాబ్ 7.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2022లో సామ్ను సీఎస్కే 5.5 కోట్లకు దక్కించుకుంది. అప్పటి నుంచి సామ్ సీఎస్కేలో కీలక ప్లేయర్గా మారిపోయాడు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. కాగా.. సామ్ కర్రాన్ తండ్రి కెవిన్ కర్రాన్ జింబాబ్వే మాజీ క్రికెటర్. సామ్ను చెన్నై అభిమానులు కుట్టితలాగా పిలుస్తుంటారు.
England got talent from IPL. Legend’s (MS Dhoni) boy Sam Curran. #EngvsPak #IPL2023Auction #EnglandCricket #ICCT20WorldCup2022 #MSDhoni #Buttler #IPL pic.twitter.com/MnRTJFDnJF
— Subhash Tanwar Arnold (@Subhash_Todeka) November 14, 2022