టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడం ఏమో గానీ ఆ దేశానికి కొందరు మాత్రం ఇంకా అదేపనిగా మనపై పడి ఏడుస్తున్నారు. అందులో పాక్ నటి షెహరి షిన్వారి ఒకరు. టోర్నీ మొదలైనప్పటి నుంచి భారత్ ఆ జట్టు చేతిలో ఓడిపోవాలి, ఈ జట్టు చేతిలో ఓడిపోవాలి అని తెగ శాపనార్థాలు పెడుతోంది. మన నెటిజన్స్ పెద్దగా ఆమెని పట్టించుకోవట్లేదు గానీ ఆప్ఘనిస్థాన్ కి చెందిన వాళ్లు మాత్రం వరసపెట్టి కౌంటర్లు వేస్తున్నారు. ఇన్నీ జరిగినా సరే ఆమె బుద్ధి మారడం లేదు. ఇప్పుడు కూడా అలానే కావాలని, కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బాగా ఆడుతోంది. నాలుగింటిలో మూడు మ్యాచ్ లు గెలిచి సెమీస్ ఛాన్సులని మెరుగుపరుచుకుంది. ఇక సూపర్-12 దశలో తన చివరి మ్యాచ్, బంగ్లాదేశ్ తో ఆదివారం ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లో జింబాబ్వే.. టీమిండియాని ఓడిస్తే ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని పాక్ నటి సెహరి షిన్వారి ట్వీట్ చేసింది. కాగా ఇది కాస్త ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. క్రికెట్ లవర్స్, భారత అభిమానులైతే ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.
ఇక తాజాగా భారత్-బంగ్లా మ్యాచ్ సందర్భంగా రోహిత్ సేన ఓడిపోవాలని పదే పదే కోరుకుంటున్నాని ట్వీట్స్ చేసింది. అయితే ఈ పోరులో పాక్ నటి అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో నెటిజన్స్ క్రియేటివ్ గా ఆలోచించి మరీ ఈమెపై కౌంటర్లు వేస్తున్నారు. ‘పాపం మీ లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఎలా బతుకుతారో తలుచుకుంటేనే బాధగా ఉంది’ అని పాక్ నటిపై జాలి చూపిస్తున్నారు. మరికొందరైతే.. భారత్ గెలిస్తే మీ ట్విట్టర్ డిలీట్ చేయండి, జింబాబ్వే ఒక్క పరుగుతో ఓడించడానికి మేం పాక్ జట్టు కాదని రివర్స్ సెటైర్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వార్ కాస్త సోషల్ మీడియాలో మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది.
I’ll marry a Zimbabwean guy, if their team miraculously beats India in next match 🙂
— Sehar Shinwari (@SeharShinwari) November 3, 2022