టీ20 వరల్డ్ కప్ 2022 హోరా హోరిగా సాగుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లకు భంగపాటు కలిగిస్తూ.. పసికూనలు సత్తా చాటాయి. దాంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక టీమ్ లు ఇంటిదారి పట్టక తప్పలేదు. ఇక ఇలాంటి మెగా టోర్నీల్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన, సరదా సంఘటనలు జరుగుతూంటాయి. లవ్ ప్రపోజల్స్, అభిమానులు కొట్టుకోవడం, తమ అభిమాన ఆటగాడిని కలవడానికి ఫ్యాన్స్ సాహసాలు చేస్తుంటారు. తాజాగా ఇండియా-జింబాబ్వే మ్యాచ్ లో సైతం ఇలాంటి సాహసమే చేశాడు ఓ కుర్రాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కలవడానికి సెక్యూరిటీ కళ్లు కప్పి వచ్చాడు. దానికి ఆ కుర్రాడు భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వచ్చింది. గ్రౌండ్ యాజమాన్యం ఆ కుర్రాడికి భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
టీమిండియా క్రికెటర్లకు భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తమ అభిమాన ఆటగాళ్లను కలుసుకోవాలని ప్రతీ ఒక్క ఫ్యాన్ కు ఉంటుంది. ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతుంటే వారిని కలుసుకోవడానికి గ్రౌండ్ లోకి దూసుకొస్తుంటారు ఫ్యాన్స్. గతంలో ధోని, విరాట్ కోహ్లీ లను కలుసుకొని, వారి కాళ్లపై పడ్డ ఫ్యాన్స్ ను సైతం మనం చూశాం. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కలుసుకోవడానికి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు ఓ కుర్రాడు. ఆదివారం టీమిండియా-జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో రోహిత్ శర్మను కలుసుకోవడానికి అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడిని గమనించిన సెక్యూరిటీ అతడి వెనుకే పరిగెత్తుకుంటూ వచ్చి అతడిని కిందపడేసి పట్టుకున్నారు.
#RohitSharma𓃵 #T20WorldCup this z our captain ❤️pic.twitter.com/MiMPUrYBKh
— Prajith (@prajithkv) November 6, 2022
ఈ క్రమంలోనే ఇది గమనించిన రోహిత్ పరిగెత్తుకుంటూ వచ్చి సెక్యూరిటీని వారించాడు. ఇక రోహిత్ కుర్రాడి దగ్గరికి రావడంతో.. అతడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురైయ్యాడు. కన్నీరు కార్చుతూ.. ఒక్క కౌగిలింత ఇవ్వాలని కోరాడు. కానీ సెక్యూరిటీ నిబంధనల దృష్ట కుదరలేదు. అక్కడితో అభిమానిని సెక్యూరిటీ గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. ఇక్కడితో ఈ వ్యవహారం ముగియలేదు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ యాజమాన్యం.. ఆ కుర్ర అభిమానికి అక్షరాలా రూ. 6.5 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అభిమానులు తమ ఆరాధ్యదైవంగా భావించే క్రికెటర్లను కలుసుకోవడానికి ఇలాంటి సాహసాలు చేయడం కొత్తేంకాదు గానీ ఇలా జరిమానా విధించడం మాత్రం కొత్తే. మరి ఈ విషయంపై టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించి.. తమ అభిమాని జరిమానా చెల్లిస్తాడా? లేదా అనేది వేచిచూడాలి.
OTHER PLAYERS HAVE FANS 💙… ROHIT SHARMA HAVE DEVOTEES 🧎!! pic.twitter.com/kbDS7ViQgv
— Rohit Sharma Fanclub India (@Imro_fanclub) November 6, 2022
A young Rohit fan invades the pitch!
Rohit request security guards to not harm that guy !!
𝗛𝗲𝗮𝗿𝘁 𝘄𝗮𝗿𝗺𝗶𝗻𝗴 𝗴𝗲𝘀𝘁𝘂𝗿𝗲 𝗳𝗿𝗼𝗺 𝗖𝗮𝗽𝘁𝗮𝗶𝗻 ❤ @ImRo45 #RohitSharma𓃵 pic.twitter.com/NHgxpuVS2Y— 𝗦𝗔𝗠¹⁷🇦🇷 (@Vitamin_is_back) November 6, 2022