భారత్ క్రికెట్ లో ఒకప్పుడు చోటు సాధించాలంటే రంజీల్లో తప్పనిసరిగా రాణించాల్సిందే. ముఖ్యంగా టెస్టుల్లో స్తానం కావాలంటే మాత్రం రంజీలు ఒక్కటే ప్రత్యామ్నాయం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు జాతీయ జట్టులో చోటు కావాలంటే ఐపీఎల్ ఆడితే సరిపోతుంది. దీంతో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సెలక్షన్ విధానాన్ని తప్పు పట్టాడు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, 3వన్డేలు, 5 టీ 20 లు ఆడాల్సి ఉంది. జులై 12 న జరిగే మొదటి టెస్టుతో ఈ పర్యటన మొదలు కానుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత టెస్టు, వన్డే జట్టుని ప్రకటించారు. వన్డే జట్టులో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోపోయినా టెస్టు జట్టు విషయంలో మాత్రం సెలెక్టర్లు కాస్త కఠినంగా వ్యవహరించారు. భారత నయావాల్ పుజారాని పక్కన పెట్టడమే కాకుండా రంజీల్లో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ కి మరో సారి అవకాశం దక్కలేదు. అంతేకాదు ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చేసిన జైస్వాల్, గైక్వాడ్ లకు తొలిసారి టెస్టు జట్టులోకి స్థానం కలిపించారు. దీంతో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ సెలక్షన్ విధానాన్ని తప్పు పట్టాడు.
భారత్ క్రికెట్ లో ఒకప్పుడు చోటు సాధించాలంటే రంజీల్లో తప్పనిసరిగా రాణించాల్సిందే. ముఖ్యంగా టెస్టుల్లో స్తానం కావాలంటే మాత్రం రంజీలు ఒక్కటే ప్రత్యామ్నాయం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు జాతీయ జట్టులో చోటు కావాలంటే ఐపీఎల్ ఆడితే సరిపోతుంది. గత కొన్నేళ్లుగా టీమిండియా ఇదే ఫార్ములాని ఫాలో అవుతూ వస్తుంది. దీంతో రంజీల్లో మంచి ప్రదర్శన చేస్తున్న ప్లేయర్లకు నిరాశే ఎదురవుతుంది. ఈ లిస్టులో సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు టీమిండియా సెలెక్షన్ కమిటీపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇక సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏకంగా రంజీలను తీసేసి ఐపీఎల్ ఆదుకోండి అని సెటైర్లు విసిరాడు. పుజారాకు తప్పించడం.. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ ని సెలెక్ట్ చేయకపోవడంపై బీసీసీఐపై గవాస్కర్ ఫైర్ అయ్యాడు.
గవాస్కర్ మాట్లాడుతూ.. “సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో ఎంత బాగా ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత మూడు సీజన్లలో అతను 100 సగటుతో పరుగులు చేశాడు. అయినా జట్టులో చోటు దక్కకపోవడం బాధ కలిగించే అంశం. టీమిండియాలోకి రావాలంటే అతను ఇంకేం చేయాలి?. తుది జట్టులో చోటు ఇవ్వకపోయినా కనీసం అతన్ని జట్టులోకి తీసుకుంటే.. రంజీల్లో ఆడుతున్న వారికి గుర్తింపు దక్కిందనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సెలక్టర్లు మాత్రం ఐపీఎల్ ఆడిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక పుజారా గురించి మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా ఒక్కడే విఫలమయ్యాడా ? అని ప్రశ్నించాడు. ఈ విషయంలో పుజారాకు మాత్రమే ఎందుకు బాలి పశువు చేసారో అర్ధం కావడం లేదు. వ్యక్తిగతంగా ఎన్నో మైలు రాళ్లు అందుకున్నాడు. కానీ అతనికి మిలియన్ల ఫాలోవర్స్ లేరు. అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.