సూర్యకుమార్ యాదవ్.. ఈపేరు ప్రస్తుతం తెగ మార్మోగిపోతోంది. ఎందుకంటే హాంకాంగ్ జట్టుపై మాములు ఇన్నింగ్స్ ఆడలేదు కదా మరి. ఆ ధనాధన్ బ్యాటింగ్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఎందుకంటే వచ్చీ రాగానే వరసగా రెండు ఫోర్లు కొట్టిన సూర్యకుమార్.. ఆ తర్వాత కూడా రిలాక్స్ అవ్వలేదు. మోత మోగించాడు. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్ కే.. పాక్ మాజీ స్టార్ ఆల్ రౌండర్ ఫిదా అయిపోయాడు. తెగ పొగిడేస్తున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్, తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అలానే ఆసియాకప్ లో హాంకాంగ్ తో మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అప్పటికే కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లు.. మెల్లగా బ్యాటింగ్ చేశారు. సూర్య మాత్రం వచ్చీ రాగానే చెలరేగిపోయాడు. 26 బంతుల్లో 68 పరుగులు చేశాడు. దీంతో చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు వచ్చాయి. అలా 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది.
ఇప్పుడు ఈ మ్యాచులోని సూర్యకుమార్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ.. ‘నాకు దొరికిన కాస్త సమయంలో ఈ మ్యాచ్ చూశాను. చెప్పాలంటే కోహ్లీ బ్యాటింగ్ చూద్దామని కూర్చున్నాను. ఈ ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమో అతడికి తెలుసు కాబట్టి విరాట్ నెమ్మదిగా ఆడాడు. ఇక సూర్యకుమార్ వచ్చీ రాగానే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. భారీ షాట్లు కొడుతున్నప్పుడు అతడి బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్ అదిరిపోయింది. ఫైనల్ గా సూర్యకుమార్.. స్టేడియంలో జనాల్ని పూర్తిగా ఎంటర్ టైన్ చేశాడు’ అని అన్నారు.
ఇక శుక్రవారం హాంకాంగ్ తో పాకిస్థాన్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో పాక్ గెలవడం దాదాపు ఖాయం. ఒకవేళ ఇదే జరిగితే.. ఈ ఆదివారం.. టీమిండియా-పాకిస్థాన్ మరోసారి తలపడటం గ్యారంటీ. ఇదే జరగాలని ఇరుదేశాల ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. మరి సూర్యకుమార్ పై అఫ్రిదీ మాటల గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్కు కోహ్లీ ఫిదా! ఊహించని విధంగా గౌరవించాడు!