సర్ఫరాజ్ అహ్మద్.. ఈ పేరు చాలా రోజులైపోయింది. అప్పుడెప్పుడో 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంలో కెప్టెన్ గా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలు నుంచి తప్పుకొన్నాడు. ఆ తర్వాత టెస్టుల్లో తప్పించి, పరిమిత ఓవర్లలో ఆడట్లేదు. అలాంటి సర్ఫరాజ్ ఇప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ గురించి పక్కనబెడితే.. అందరూ చేతులెత్తేసినా సరే అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. పాక్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రస్తుతం రెండో టెస్టు సిరీస్ ఆడుతోంది. డిసెంబరు చివర్లో తొలి మ్యాచ్ జరగ్గా, అది డ్రాగా ముగిసింది. కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ కెప్టెన్ సర్ఫారాజ్ అహ్మద్ ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. సూపర్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలానే సర్ఫరాజ్ పోరాట పటిమ చూసి క్రికెట్ ప్రేమికులు కూడా మెచ్చుకుంటున్నిారు.
కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. 449 పరుగులకు ఆలౌటైంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో పాక్ 408 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ ఆడిన కివీస్ జట్టు.. 277/5 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చేసింది. దీంతో బరిలో దిగిన పాక్ జట్టు.. కష్టాల్లో పడింది. బ్యాటర్లు అందరూ కూడా తక్కువ స్కోర్లు చేసి వెనుదిరిగారు. ఇలాంటి టైంలో సర్ఫరాజ్ అహ్మద్ జట్టుకు అండగా నిలబడ్డాడు. 125 బంతుల్లో సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?
One of the finest 4th innings hundred in recent times, Pakistan was 80 for 5 while chasing 319 runs and then Sarfaraz Ahmed smashed hundred from 135 balls. pic.twitter.com/RwYc5JMXeo
— Johns. (@CricCrazyJohns) January 6, 2023