బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నద్ధం అయ్యాయి. ప్రస్తుతం టీమిండియా వరుసగా సిరీస్ లు గెలుస్తూ.. ఫుల్ స్వింగ్ లో ఉంది. మరో వైపు ఆసిస్ కూడా జోరు మీదుంది. దాంతో ఇరు జట్ల మధ్య సమవుజ్జీల సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పలు కీలక విషయాలు ప్రెస్ మీట్ లో వెల్లడించాడు. తొలి టెస్ట్ కు ముందు జట్టు కూర్పుపై స్పందించాడు రోహిత్. ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్లు అందరు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నారని ప్రశంసించాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. యాషెస్ తర్వాత మళ్లీ అంతటి పేరున్న టోర్నీ. ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఆ మహాసంగ్రామానికి తెరలేవనుంది. ఈ క్రమంలోనే జట్టు కూర్పుపై కీలక విషయాలు వెల్లడించాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ..” ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన ఫామ్ లో ఉంది. టీమ్ లోని అందరు ఆటగాళ్లు మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. దాంతో ఈ మ్యాచ్ కు ఎవరిని ఎంపిక చేయాలో అర్ధం కావట్లేదు. అయితే ఆ రోజు పిచ్ కండీషన్ ను బట్టి ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందో వారినే సెలెక్షన్ చేస్తాం” అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
అయితే ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ని ఆడిస్తారా? లేక శతకాలతో అదరగొడుతున్న శుభ్ మన్ గిల్ ను ఆడిస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం రోహిత్ సమాధానం ఇవ్వలేదు. ఇక తొలి టెస్ట్ కు ఆతిధ్యం ఇస్తున్న నాగపూర్ పిచ్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్ టీమిండియాకు అనుకూలంగా తయ్యారు చేసుకున్నారని ఆసిస్ మాజీలు విమర్శిస్తున్నారు. నాగపూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో పాటుగా.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు తిప్పలు తప్పవు అని తెలుస్తోంది. అందుకే పిచ్ ను పరిశీలించి జట్టు కూర్పు ఉంటుందని రోహిత్ చెప్పుకొచ్చాడు. మరి పిచ్ ను బట్టే జట్టు కూర్పు ఉంటుందని రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Permutation-combination for the #INDvAUS Test series opener❓#TeamIndia | @ImRo45 pic.twitter.com/njzAzGLNEp
— BCCI (@BCCI) February 8, 2023