ప్రో కబడ్డీ లీగ్ 2021లో శనివారం పుణేరి పల్టాన్తో చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ చెలరేగి ఆడాడు. వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్ను విజయం దిశగా నడిపించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టైటాన్స్.. ఫస్ట్ హాఫ్లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 17-13తో అధిక్యంలో నిలిచింది. ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి 20-14తో మంచి అధిక్యత సాధించింది. అయితే సెకాండాఫ్లో పుణేరి పల్టాన్ జట్టు అద్భుతంగా పుంజుకుంది. తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసి ఓ దశలో 4 పాయింట్ల అధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ దశలో అలర్ట్ అయిన తెలుగు టైటాన్స్ స్కోర్ను 25-25తో సమం చేసింది. ఇరు జట్లు పట్టుదలగా పోరాడడంతో 33-33 వద్ద స్కోర్లు మళ్లీ సమం అయ్యాయి. చివరి రైడ్లో తెలుగు టైటాన్స్ 33-34 తేడాతో ఒక్క పాయింట్ వెనుకంజలో నిలిచింది. ఈ సమయంలో రైడ్కు వెళ్లాడు రాకేష్. టైటాన్స్ మ్యాచ్ కాపాడుకోవాలంటే కచ్చితంగా పాయింట్ సాధించాల్సిన ఆ రైడ్లో రాకేష్ బోనస్ సాధించాననే కాన్ఫిడెంట్తో తిరిగొచ్చాడు. కానీ రిఫరీ ఎలాంటి బోనస్ పాయింట్ ఇవ్వలేదు. దీంతో టైటాన్స్ రివ్యూకు వెళ్లింది.
It’s half-time in the second game and Telugu Titans are leading by 6️⃣ points 🔥#PUN 1️⃣4️⃣-2️⃣0️⃣ #TT
📸 Pro Kabaddi League#PKL2021 #ProKabaddiLeague #PUNvTT pic.twitter.com/WWf59t8G3e
— Sportskeeda (@Sportskeeda) December 25, 2021
రివ్యూలో కూడా బోనస్ పాయింట్ రాలేదని తేలడంతో తెలుగు టైటాన్స్కు ఒక్క పాయింట్ తేడాతో ఓటమి తప్పలేదు. కాగా తెలుగు టైటాన్స్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ మాత్రం 15 పాయింట్లతో సత్తా చాటాడు. అయితే పోరాటం వృథా అయింది. అటు పాట్నా పైరేట్స్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో యూపీ యోధా కూడా ఒక్కపాయింట్ తేడాతోనే నెగ్గింది. జైపూర్ పింక్ పాంథర్స్, హర్యాణా స్టీలర్స్ మధ్య జరిగిన మూడో మ్యాచ్లో కూడా కేవలం 2 పాయింట్ల తేడాతో పింక్ పాంథర్స్ను విజయం వరించింది.