కొన్నేళ్ల క్రితం ఫ్యూచర్ స్టార్ గా కితాబులందుకున్న పృథ్వీ షా.. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం పరితపిస్తున్నాడు. ఇటీవలే యువకులకు అవకాశం ఇస్తున్న సెలక్టర్లు షాని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో షా తన సెలక్టర్ల మీద అసంతృప్తి వ్యక్తం చేసాడు.
“పృథ్వీ షా” కొన్ని సంవత్సరాల క్రితం ఈ పేరు ఒక సంచలనం. అండర్ 19, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొడుతూ అతి తక్కువ వయసులోనే టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. అంతేకాదు 18 సంవత్సరాల వయసులో తన తొలి టెస్టు సెంచరీ నమోదు చేసి ఫ్యూచర్ ఇండియన్ స్టార్ గా అందరి దగ్గర నుండి ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ కూడా సత్తా చాటుతూ తన ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసుకున్నాడు. సచిన్ లోని క్లాస్, సెహ్వాగ్ లో దూకుడు కలగలిపిన షా బ్యాటింగ్ చాలా సొగసరిగా ఉండేది. ఇంతవరకు బాగానే ఉన్నా .. సడన్ గా షా కెరీర్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. దీంతో టీమిండియాలోని ఐపీఎల్ లో కూడా పృథ్వీ షా కి ప్లేస్ లభించడం లేదు. దీంతో అసహనానికి లోనైనా పృథ్వీ షా సెలక్టర్ల మీద అసహనం వ్యక్తం చేసాడు.
2018 లోనే పృథ్వీ షా అరంగ్రేటం జరిగింది. తన తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచులోనే సెంచరీ కొట్టేసాడు. ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన షా.. అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో దారుణంగా నిరాశపరిచాడు. ఇక అప్పటినుంచి జట్టులో స్థానం కోల్పోయిన ఈ ముంబై బ్యాటర్ కి సెలక్టర్లు మరో అవకాశం ఇవ్వలేదు. 2020లో న్యూజిలాండ్పై వన్డేల్లో, 2021లో శ్రీలంకపై టీ20 ఆరంగ్రేటం చేసిన పృథ్వీ షా.. రెండేళ్లుగా అంతర్జాతీయ టీమ్లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా షా దారుణంగా నిరాశపర్చడం ప్రతికూలంగా మారింది. అయితే ఇటీవలే ఆసియా గేమ్స్, ఐర్లాండ్ తో సిరీస్ లో సెలక్టర్లు యువకులకు అవకాశం ఇస్తున్న నేపథ్యంలో షా మీద కరుణ చూపించడం లేదు. దీంతో షా నేను సెలక్ట్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నా సెలక్టర్లు నన్ను పట్టించుకోవడం లేదని వాపోయాడు.
“ఆస్ట్రేలియా టూర్లో ఒకే ఒక్క టెస్టు ఆడాను. ఆ తర్వాత మళ్లీ నన్ను సెలక్ట్ చేయలేదు. ఒక్క అవకాశంతో నన్నెందుకు పక్కన పెట్టారో అర్ధం కావడం లేదు. కొందరు ఫిట్నెస్ వంకగా చూపిస్తున్నారు. కానీ బెంగళూరులో నేను ఫిట్నెస్ టెస్టు పాస్ అయ్యాకే కదా టీమ్కి ఆడాను.కమ్బ్యాక్ కోసం నేనేం చేయాలో అన్నీ చేశాను. టీ20 మ్యాచ్లో ఆడాను. ఆ తర్వాత మళ్లీ అవకాశం దక్కలేదు. ఒక్క మ్యాచ్తో నా టెక్నిక్ని ఎలా డిసైడ్ చేస్తారు. టీమ్లో ప్లేస్ దక్కనందుకు చాలా నిరుత్సాహపడ్డాను. అయితే అన్నీ మరిచిపోయి కష్టపడాలని డిసైడ్ అయ్యా. నా చేతిలో ఏమి లేదు నేను ఏమి చేయలేను. నా గురించి జనాలు చాలా చెప్పుకుంటారు గానీ వ్యక్తిగతంగా నేను చాలా ప్రైవేట్ పర్సన్ ని. నాకెవరూ స్నేహితులు కూడా లేరు. నేను ఎవరితో కూడా నా విషయాలను షేర్ చేసుకోను. బాధగా అనిపించినప్పుడు నా రూమ్ లోకి వెళ్లి ఒంటరిగా కూర్చుంటా. బయటకు వెళితే జనాలు నవ్వుతూ నన్ను ఏడిపిస్తారు. అందుకే ఒంర్తరీతనం అలవాటు చేసుకున్నాను. అని పృథ్వీ షా తన మనసులోని బాధను తెలియజేశాడు. మరి షా మాటలు మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.