గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ‘టీ20 ప్రపంచకప్-2021’ టోర్నీలో పాకిస్తాన్ జట్టు సెమీస్ కు చేరిన విషయం తెలిసిందే. ఆ జట్టు సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించిన వారిలో పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఒకడు. అయితే, సెమీ ఫైనల్కు ముందు రిజ్వాన్ చెస్ట్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన విషయం అందరకి గుర్తుండే ఉంటుంది. ఐసీయూలో చికిత్స పొందిన అతడు కోలుకోవడమే గగనమంటే.. ఆసీస్తో సెమీ ఫైనల్ మ్యాచులో తలపడ్డాడు. అయితే మ్యాచ్ కు ముందు అతడు నిషేధిత మందులు వాడాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డాక్టర్ నజీబుల్లా సుమ్రో సంచలన వ్యాఖ్యలు చేశాడు.
రిజ్వాన్కు చికిత్స అందించిన డాక్టర్ నజీబుల్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘‘ఆరోజు నువ్వు అసలు శ్వాస తీసుకునే పరిస్థితుల్లో కూడా లేవు. నువ్వు కోలుకోవాలంటే నీకు ఇంజెక్ట్ చేయాల్సిన మెడిసన్ గురించి ఐసీసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి ఆ మెడిసిన్ అథ్లెట్లు వాడటం నిషేధం. కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. అందుకు కచ్చితంగా ఐసీసీ పర్మిషన్ తీసుకోవాలి’’ అని రిజ్వాన్తో ఇంటర్వ్యూలో నజీబుల్లా వ్యాఖ్యానించాడు.
Mohammad Rizwan and Dr Najeebullah Soomro reveal the tale of those 30 hours before the @T20WorldCup semi-final.
Watch the full video ➡️ https://t.co/r0KlzKRg2M pic.twitter.com/dWLEMXRMQd
— Pakistan Cricket (@TheRealPCB) May 8, 2022
ఇది కూడా చదవండి: ICUలో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా.. షాక్ లో ఫ్యాన్స్!
అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా మైదానంలో దిగాడంటూ అప్పట్లో రిజ్వాన్పై ప్రశంసలు కురిపించినోళ్లు.. ఇప్పుడు మాత్రం నోరు మెదపట్లేదు. ఇదిలాఉండగా.. రిజ్వాన్ కు నిషేధిత మెడిసన్ ఇచ్చామన్న నజీబుల్లా దాని పేరును వెల్లడించకపోవడం గమనార్హం. అంతేకాదు ఐసీసీ పర్మిషన్ తీసుకున్నారా..? లేదా..? అనేదానిపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం నజీబుల్లా వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఆ మ్యాచులో పాకిస్తాన్ జట్టు 176 పరుగులు చేయగా.. ఆసీస్ బ్యాటర్లు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించారు. ఈ మ్యాచులో రిజ్వాన్ 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు.