ఐపీఎల్ లో ఒకే ఒక్క సెంచరీతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. అప్పటివరకు సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మకు కూడా సాధ్యం కానీ ఐపీఎల్ సెంచరీని చేసి చూపించిన ఆ క్రికెటర్ ప్రస్తుతం క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఇంతకు ఎవరా క్రికెటర్?
అది 2011 ఐపీఎల్. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ జట్ల మధ్య లీగ్ మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మురళి విజయ్ (74), బద్రినాథ్ (66),కెప్టెన్ ధోని (43) బ్యాట్ ఝళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక లక్ష్య ఛేదనలో స్టార్ బ్యాటలు గిల్ క్రిస్ట్, షాన్ మార్ష్ త్వరగానే పెవిలియన్ కి చేరారు. అసలే బలహీనంగా ఉన్న పంజాబ్ జట్టుకి చెప్పుకోవడానికి ప్రధాన బ్యాటర్లు కూడా ఎవరూ లేరు. పైగా కెప్టెన్ ధోనీ కావడంతో ఇంకేముంది చెన్నై విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. పంజాబ్ డగౌట్ లో కూడా విజయం మీద ఎలాంటి ఆశలు లేవు. ఈ దశలో ఒక కుర్రాడు చెన్నై బౌలర్లని ఉతికి ఆరేసాడు. ఏ ఒక్క బౌలర్ ని వదలకుండా బౌండరీల వరద పారించాడు. 63 బంతుల్లోనే 120 పరుగులు చేసి జట్టుకి ఊహించని విజయాన్ని అందించాడు. అతడెవరో కాదు ముంబై బ్యాటర్ పాల్ వాల్తాటి. తాజాగా వాల్తాటి క్రికెట్ కి వీడ్కోలు పలికాడు.
పాల్ వాల్తాటి ఐపీఎల్ లో ఒకే ఒక్క సెంచరీతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. అప్పటివరకు సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మకు కూడా సాధ్యం కానీ ఐపీఎల్ సెంచరీని వాల్తాటి చేసి చూపించాడు. ఈ ఇన్నింగ్స్ తో ఒక్కసారిగా మారు మ్రోగిపోయిన వాల్తాటి ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఐపీఎల్ లో ఈ యంగ్ ప్లేయర్ కి చోటు దక్కలేదు. ఇక ఆ తరవాత దేశవాళీ క్రికెట్ లో ఆడుతూ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాడు. టీమిండియా నుంచి ప్లేస్ వస్తుందని ఆశించినా అది జరగలేదు. దీంతో వాల్తాటి డొమెస్టిక్ క్రికెట్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇన్నేళ్లకు తాను ఆటకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే వాల్తాటి డొమెస్టిక్ మ్యాచులకి మాత్రమే వీడ్కోలు పలకనున్నాడని క్లారిటీ ఇచ్చేసాడు.
వాల్తాటి ముంబైకి చెందిన క్రికెటర్. 23 ఐపీఎల్ మ్యాచులో 505 పరుగులు చేసాడు. అత్యధిక స్కోర్ 120 పరుగులు కాగా సగటు 22.ఇక 5కేవలం 120 పరుగులు మాత్రమే చేసాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో 4 మ్యాచుల్లో కేవలం 76 పరుగులు చేసాడు. అడపాదడపా బౌలింగ్ చేసే వాల్తాటి మొత్తం 11 వికెట్లు తీసాడు. కెరీర్ పరంగా ఐపీఎల్ లో ఒక్క సెంచరీ మినహా చెప్పుకోదగ్గ విషయం ఏమి లేదు. 2002 అండర్ 19 వరల్డ్ కప్ లో వాల్తాటి సభ్యుడు. ప్రస్తుతం 39 ఏళ్ళ వయసున్న వాల్తాటికి డొమెస్టిక్ క్రికెట్ లో కూడా చోటు దక్కడం లేదు. దీంతో ఈ ఐపీఎల్ సెంచరీ హీరో తన కెరీర్ కి ముగింపు పలికేసాడు. మరి వాల్తాటి రిటైర్మెంట్ ప్రకటించడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.