ఈ మ్యాచ్ టీమిండియాకు గెలిస్తే అది కేవలం ఫ్యాట్ కమ్మిన్స్ కారణంగానే అని చెప్పుకోవాలి. అదేంటి భారత్ కి కమ్మిన్స్ అదృష్టం తోడవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.. మీరు వింటుంది నిజమే. ఈ మ్యాచులో టీమిండియా ప్లేయర్లకి ఆసీస్ కెప్టెన్ అనుకోని వరంలా మారాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ మెల్లగా పుంజుకుంటుంది. తొలి రెండు రోజులు పూర్తిగా ఆసీస్ ఆధిపత్యం చెలాయించగా మూడో రోజు మాత్రం టీమిండియా రాణిస్తుంది. 5 వికెట్లను 151 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో బరిలోకి దిగిన టీమిండియా.. తొలి ఓవర్లోనే బొలాండ్ షాకిచ్చాడు. వికెట్ కీపర్ భరత్ ని ఓవర్ నైట్ స్కోర్ వద్దే అవుట్ చేసి ఆసీస్ కి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఈ సమయంలో భారత్ విజయం భారత్ కి ఫాలో ఆన్ తప్పేలా కనిపించలేదు. కానీ లార్డ్ శార్ధూల్ ఠాకూర్ తో అజింక్య రహానే భారత్ ని ఒక ట్రాక్ పైకి తెచ్చాడు. లంచ్ సమయానికి 6 వికెట్లకు 200 పరుగులు చేసిన టీమిండియా.. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే కేవలం 9 పరుగులు చేస్తే చాలు. ఇక ఈ మ్యాచులో టీమిండియా ప్లేయర్లకి ఆసీస్ కెప్టెన్ అనుకోని వరంలా మారాడు.
ఈ మ్యాచ్ టీమిండియాకు గెలిస్తే అది కేవలం ఫ్యాట్ కమ్మిన్స్ కారణంగానే అని చెప్పుకోవాలి. అదేంటి భారత్ కి కమ్మిన్స్ అదృష్టం తోడవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.. మీరు వింటుంది నిజమే. ప్రస్తుతం రహానే 89 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. నిజానికి రహానే నిన్న కమ్మిన్స్ బౌలింగ్ లో వ్యక్తిగత స్కోర్ 17 పరుగుల వద్ద ఎలిబీడబ్ల్యూ రూపంలో ఔటవ్వల్సింది. కానీ రివ్యూ తీసుకున్న రహానేకు కలిసి వచ్చింది. రివ్యూ లో అది నోబాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ లైఫ్ ని ఉపయోగించుకున్న రహానే.. సెంచరీ దిశగా అడుగుకు వేస్తున్నాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న రహానే- శార్ధూల్ ఠాకూర్ ని జోడీని విడదీసి కమ్మిన్స్ ఆసీస్ కి బ్రేక్ ఇచ్చాడు.
శార్ధూల్ ఠాకూర్ ని ఎలిబీడబ్ల్యూ చేసినప్పటికీ మరోసారి రివ్యూకి వెళ్లగా.. నోబాల్ రూపంలో మరోసారి అదృష్టం కలిసి వచ్చింది. దీంతో ఈ మ్యాచులో భారత్ దాదాపు ఫాలో ఆన్ తప్పించుకున్న భారత్.. ఎంతవరకు బ్యాటింగ్ చేస్తుందో చూడాలి. వీటితో పాటు ఈ మ్యాచులో ఆసీస్ ఫీల్డింగ్ లో చాలా తప్పిదాలు చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. మరి వీరు చేసుకున్న స్వయంకృపరాధం ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడలు. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.